Pages

Tuesday, January 31, 2017

Check out the moment a sperm makes contact with an egg

*రాముడి వంశ వృక్షo*

*రాముడి వంశ వృక్షo*

*ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం*

*బ్రహ్మ కొడుకు మరీచి*

*మరీచి కొడుకు కాశ్యపుడు.*

*కాశ్యపుడు కొడుకు సూర్యుడు.*

*సూర్యుడు కొడుకు మనువు.*

*మనువు కొడుకు ఇక్ష్వాకువు.*

*ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*

*కుక్షి కొడుకు వికుక్షి.*

*వికుక్షి కొడుకు బాణుడు.*

*బాణుడు కొడుకు అనరణ్యుడు.*

*అనరణ్యుడు కొడుకు పృధువు.*

*పృధువు కొడుకు త్రిశంఖుడు.*

*త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)*

*దుంధుమారుడు కొడుకు మాంధాత.*

*మాంధాత కొడుకు సుసంధి.*

*సుసంధి కొడుకు ధృవసంధి.*

*ధృవసంధి కొడుకు భరతుడు.*

*భరతుడు కొడుకు అశితుడు.*

*అశితుడు కొడుకు సగరుడు.*

*సగరుడు కొడుకు అసమంజసుడు.*

*అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*

*అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*

*దిలీపుడు కొడుకు భగీరధుడు.*

*భగీరధుడు కొడుకు కకుత్సుడు.*

*కకుత్సుడు కొడుకు రఘువు.*

*రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*

*ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*

*శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*

*సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*

*అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*

*శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*

*మరువు కొడుకు ప్రశిష్యకుడు.*

*ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*

*అంబరీశుడు కొడుకు నహుషుడు.*

*నహుషుడు కొడుకు యయాతి.*

*యయాతి కొడుకు నాభాగుడు.*

*నాభాగుడు కొడుకు అజుడు.*

*అజుడు కొడుకు ధశరథుడు.*

*ధశరథుడు కొడుకు రాముడు.*

*రాముడి కొడుకులు లవ కుశలు . .*

*ఇది రాముడి వంశ వృక్షo ...*
***************👏👏👏

వసంత పంచమి విశిష్టత ఏమిటి?

వసంత పంచమి విశిష్టత ఏమిటి?
మాఘ మాసం (జనవరి-ఫిబ్రవరి) శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధరిని పూజించే మరొక పర్వ దినమైన "సరస్వతీ పూజ" దసరాలలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు "అక్షరాభ్యాసం" జరుపుతారు.  హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం), ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ సంస్కారాలే.  
      అక్షరాభ్యాసం (అక్షర అభ్యాసం) అంటే అక్షరాలను సాధన చేయడం. దీన్ని ఈ దినం తొలిసారిగా దిద్దటం తో ప్రారంభిస్తారు. సాధారణంగా పిల్లలకు అయిదు సంవత్సరాల ప్రాయం లో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింప లేనిది; "అభ్యాసం" అంటే సాధన.  ఇంకో విశేషం ఏమిటంటే "అక్షర" లో "అ" మొదలుకుని "క్ష"-"ఱ" తో ముగిసేవి కనుక "అక్షఱ"ములు అని చెప్పుకోవచ్చును. 
      అక్షరాభ్యాసం చేసేటప్పుడు "ఓం నమః శివాయ సిద్ధం నమః" అని ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలక పై వ్రాయిస్తారు. అయితే పరిణామ క్రమం లో పలక-పుల్ల నుంచి పుస్తకం-పెన్సిల్/పెన్ను తదుపరి కంప్యూటర్ - మౌస్ కు మారాయనుకోండి.
అయితే అక్షరాభ్యాస సమయంలో సరస్వతీ దేవిని ఇలా స్తుతిస్తారు.

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా!

వాగ్దేవి సరస్వతి ని తలచుకొంటే 'బాసర' జ్ఞాన సరస్వతి ఆలయం చెప్పుకోదగినది.  ఈ ఆలయం తెలంగాణా లో నిర్మల్ జిల్లాలో పావన గోదావరీ తీరాన వుంది. కురుక్షేత్ర యుద్దానతరం శాంతి కోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, దండకారణ్యం దర్శించి, ఆ స్థలం చాల అనుకూలంగా ఉంటుందని తలచి, సమీపంలోని గోదావరి నదినుండి దోసిళ్ళతో ప్రతి రోజూ ఇసుకను తెచ్చి మూడు రాశులుగా పోయగా అవి పసుపు పూసిన సరస్వతి, లక్ష్మి మరియు కాళీ మూర్తులుగా, ముగ్గురమ్మలు గా మారాయట. ఈ పసుపును(బండారు) కొద్దిగా తింటే విజ్ఞానము, వివేకము పెంపొందుతాయని భక్తుల నమ్మకం.   వ్యాసుని చే సృష్టించ బడిన ఈ ప్రదేశం "వ్యాసపురి,"గా"వాసర" గా, తదుత్తర కాలంలో "బాసర" గా వాసి కెక్కిందని స్థల పురాణం. ఆ విధంగా వసంత పంచమి నాడు ఎక్కడ చూసినా పసుపు రంగు దర్శనమిస్తుంది. అమ్మవారికి పసుపు చీరలు పెడతారు. పసుపు రంగుల మిఠాయిలు నైవేద్యం పెడతారు.  ఎందఱో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తారు.  అంతే కాదు చాల మంది యుక్తవయస్కులు సరియైన ఉపాధి లేక, జీవితంలో స్థిరపడని వారు బాసర క్షేత్రం దర్శించి ఇక్కడి పావన గోదావరిలో మూడు మునకలేసి దీక్షగా భిక్ష చేసిన వారికి అనువైన బ్రతుకుతెరువు లభిస్తుందని పలువురి నమ్మకం. అందుకే భాషను పెంపొందించి, బ్రతుకు బాట చూపి బాసట గా నిలిచేది బాసర.

new technology in opening an atherosclerotic artery awesome! !

Banned from entering the U S

Monday, January 30, 2017

*🕌తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు🕍*

*🕌తెలంగాణాలో దర్శనీయ ప్రదేశాలు🕍*

🕉🕉 *కొమ్మాల*

వరంగల్‌కు 40 కి.మీ. దూరంలో ఉంది. ఈ కొమ్మాల తీర్థం పాండవులు తపస్సు చేసిన ప్రాంతం. ఈ గ్రామంలోని ఒక గుట్టుకు పాండవుల గుట్ట అని పేరు. దీనిపై కోనేరు ఉంది.

🔷🔷 *లక్నవరం చెరువు*

ములుగు నుంచి ఏటూరు నాగారం వెళ్లే మార్గంలో వరంగల్‌కు 70 కి.మీ. దూరంలో ఈ చెరువు ఉంది.

🏄🏼🏄🏼 *రామప్ప చెరువు*

ఈ చెరువు పాలంపేట రామప్ప ఆలయం దగ్గర్లో ఉంది. కాకతీయ గణపతి దేవుని కాలంలో (1213లో) రేచర్ల రుద్రుడు నిర్మించాడు. కాకతీయ ప్రభువులు ఆలయం సమీపంలోనే చెరువు ఉండాలన్న సంప్రదాయాన్ని పాటించేవారు. అందుకే  రామప్ప చెరువును తవ్వించారు. ఈ చెరువు ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతుంది.

🕌🕌 *ఘనపురం ఆలయాలు*:

పాలంపేటకు 8 కి.మీ. దూరంలో కాకతీయుల కాలానికి చెందిన 22 దేవాలయాలు ఉన్నా యి. ప్రధాన ఆలయం శైవాలయం. రామప్ప దేవాలయం నిర్మాణం జరిగిన కొంతకాలానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. గ్రామం చివర రెడ్డి గుడి అనే దేవాలయం ఉంది.

🏓🏓 *ఘనపురం తటాకం*

ములుగు తాలూకాలో ఉంది. ఇక్కడ అనపోతుని శాసనం కలదు. ఇక్కడ ఎండాకాలంలో చల్లని నీరు ప్రవహిస్తూ, వర్షాకాలంలో నీరు ప్రవహించదు.

⚪⚫ *కొమరవెల్లి*

జనగామకు 13 కి.మీ. దూరంలో వీరశైవ మతకేంద్రం ఉంది. ఇక్కడ మట్టితో చేసిన 4 అడుగుల విగ్రహం ఉంది. 4 చేతులలో త్రిశూలం, నాగాస్త్రం, ఒక పాత్ర ఉన్నాయి. ఇక్కడి ప్రధాన దైవ కొమరెల్లి మల్లన్న.

⭕ *పాకాల చెరువు*

ఈ చెరువు విహార సరస్సు. దీని నుంచి 5 పంట కాలువలు కలవు. వరంగల్‌కు 70 కి.మీ దూరంలో పచ్చటి చెట్లు పెరిగిన గుట్టల మధ్య ఈ చెరువు ఉంది. కాకతీయ గణపతి దేవుడు ఈ చెరువును తవ్వించినట్టు చెబుతారు. పాకాల చెరువు చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకాల వన్యమృగ అభయారణ్యం ఉంది. శీతాకాలంలో వలస వచ్చే పక్షులతో పాటు పెద్ద పులులు, చిరుతలు, జింకలు కూడా అందులో ఉన్నాయి. మున్నేరు వాగు ఈ సరస్సుకు ఆధారం.

🔘 *పెంబర్తి*
:కాకతీయులు తమ రథాలను, ఆలయాలను అలంకరించుకోవడానికి దళసరి రేకును విరివిగా ఉపయోగించేవారు. ఈ అలంకరణ అనేది ఒక కళ. కాకతీయ సామ్రాజ్యం క్షీణించిన తర్వాత ఈ కళ పతనమైంది. అయితే నిజాం నవాబుల కాలంలో ఈ కళను పునరుద్ధరించారు. వరంగల్‌కు 60 కి.మీ. దూరంలోని పెంబర్తి కళాభిమానులు తప్పక సందర్శించే ప్రాంతం.

💥 *ఏటూరి నాగారం*

వరంగల్‌కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో, గోదావరి తీరాన అభయారణ్యం ఉంది. అందులో తేళ్లు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఉన్నాయి. చుట్టూ చిన్నచిన్న గుట్టలతో, పచ్చని చిట్టడవులతో ఈ అభయారణ్యాన్ని చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. ఏటూరి నాగారం సమీపంలోని తాడ్వాయ్‌లోనూ అటవీశాఖ కాటేజీలను నిర్వహిస్తుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అక్టోబర్-మే నెలల మధ్యకాలం అనువైనది.

☄☄☄ *తాటికొండ*

: ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు 7 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ రెండు కోటలు ఉన్నాయి. దీన్ని సర్దార్ సర్వాయి పాపన్న కట్టించాడని ప్రతీతి.

🌟🌟 *పాలకుర్తి*

ఈ గ్రామం ఘనపురం రైల్వే స్టేషన్ నుంచి 29 కి.మీ. దూరంలో ఉంది. పాలేరు............. వాగు ఇక్కడి నుంచే పుడుతుంది. అందుకే పాలకుర్తి అనే పేరు వచ్చింది. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం ఉంది. దీనికి సోమనాథాలయం అనే పేరు వచ్చింది. వీరశైవ మతవాది అయిన కవి పాలకుర్తి సోమనాథుడు

🍀🍀🍀 * శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం - వేములవాడ:*

కరీంనగర్‌కు 35 కి.మీ. దూరంలో కలదు. ఇక్కడ ధర్మ కుండం అనే కోనేరు ఉంది. వేములవాడ చాళుక్యరాజు రాజాధిత్యుడు ఈ ఆలయ నిర్మాత. అర్జునుడి మనుమడు నరేంద్రుడు నిర్మించాడనేది స్థల పురాణం. ఈ ఆలయంలో 22 శివ లింగాలున్నాయి. అందులో రామాలయం, మహిషాసురమర్దని ఆలయం, కాశీ విశ్వనాథాలయం చూడదగినవి.

⚜ *కాళేశ్వరం*

: గోదావరి ఉపనది కాళేశ్వరం కలిసేచోట ఉంది. స్కాంద పురాణంలో దీని ప్రస్తావన కలదు. ఇక్కడి శిల్పాలపై బౌద్ద-జైన శిల్ప రీతుల ప్రభావం కనిపిస్తుంది. వేంగిరాజు విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని జయించినట్లు ఆధారాలున్నాయి. ఆయన దండయాత్ర నాటికి నగరంలో 26 కోనేరులు ఉండేవట. కాకతీయ ప్రోలరాజు బంగారంతో తులాభారం తూగి, దాన్ని స్వామికి ఇచ్చాడని స్థానికుల అభిప్రాయం. ఇక్కడి ముక్తేశ్వరాలయంలో 2 శివలింగాలుండటం విశేషం. ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలుండటం మరో విశేషం. ఇక్కడ బ్రహ్మకు గుడికట్టారు. 1246 నాటి కాకతీయ గణపతి దేవుని శాసనం ఇక్కడుంది.

🕌🕌 *ధర్మపురి:*

కరీంనగర్‌కు 65 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని 108 పుణ్యక్షేత్రాల్లో ధర్మపురి ఒకటి. దీనికి దక్షిణ కాశీ అని పేరు.

  🚩🚩 *రామగిరి దుర్గం:*

 కరీంనగర్‌కు 40 కి.మీ. దూరంలో బేగంపేట గ్రామం వద్ద ఉన్న ఎత్తైన పర్వతాన్ని రామగిరి అంటారు. 
తెలంగాణలోనే అతిపెద్ద శత్రుదుర్భేద్యమైన కోట ఇక్కడ ఉంది. ఇక్కడి సీతారామాలయం దగ్గర్లో పాండవ లంక ఉంది.

🕍🕍🕍 *నాగనూరు కోట:*

 ఇది కాకతీయుల నిర్మాణం. కరీంనగర్‌కు 8 కి.మీ. దూరంలో ఉంది. కోటలో 3 ఆలయాలు ఉన్నాయి.

♣ *వరాహస్వామి ఆలయం* 

కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండేరెండు వరాహస్వామి ఆలయాల్లో ఇది ఒకటి. బండపై చెక్కిన విగ్రహం వెంట్రుకలు కనిపించడం విశేషం. స్థల పురాణం ప్రకారం 600 సంవత్సరాల చరిత్ర ఉంది. 
కరీంనగర్‌కు 60 కి.మీ. దూరంలో ఉంది.

✳ *కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం*

: 400ల ఏండ్ల క్రితం కొడిమ్యాల పర్గణాలో సింగం సంజీవుడనే యాదవ కులస్థుడు స్థాపించాడు. ఇక్కడి విగ్రహం రెండు ముఖాలతో (నారసింహస్వామి ముఖం, ఆంజనేయస్వామి ముఖం) ఉండటం విశేషం.

♨ *కొత్తకొండ కోర మీసాల స్వామి:*

భీమదేవరపల్లి మండలం, కొత్తకొండలో ఉంది. ఇది ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధమైన వీరభద్ర క్షేత్రం.

☢☢ *మత్స్యగిరీంద్రుడు:*

 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో మత్స్య గిరీంద్రుని ఆలయాన్ని నిర్మించారు. ఇది కరీంనగర్‌కు 30 కి.మీ. దూరంలో ఉంది.

🔶 *మంథని:*

మంథని అంటే వేద విద్యలకు పుట్టినిల్లు. ఇక్కడ లక్ష్మీనారాయణ, ఓంకారేశ్వర, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలతోపాటు జైన, బౌద్ద మతాల ఆలయాలు ఉన్నాయి.

🔮 *బాసర:*

బాసరలో జ్ఞాన సరస్వతీ దేవాలయం ఉంది. బాసరను వ్యాసపురి అని కూడా అంటారు. ఇది గోదావరి తీరంలో ఉంది.

🛢 *బాసరకు పేరు*

 - వ్యాసుడు తపస్సు చేసి సరస్వతీదేవిని ప్రతిష్టించినందుకు వ్యాసర అనే పేరు వచ్చింది. వ్యాసర క్రమంగా బాసర అయింది. బాసర ఆలయం దేశంలోనే రెండో అతిపెద్ద సరస్వతి దేవాలయం (మొదటిది జమ్ముకశ్మీర్‌లో ఉంది.).

🕌🕌🕌 *నాగోబా ఆలయం*

: ముట్నూరుకు దగ్గరలో కేస్లాపూర్ గ్రామంలో ఉంది. నాగోబా అంటే సర్ప దేవత. వేలమంది గిరిజనులు నాగుల చవితి సందర్భంలో ఇక్కడ మహా ఉత్సవం చేస్తారు.

🕍🏛 *అగస్త్యేశ్వరాలయం*

: గోదావరి తీరంలో అగస్త్యుడు తపస్సు చేసిన ప్రాంతం. చెన్నూరులో ఉన్న ఈ ఆలయాన్ని ఉత్తర వాహిని అంటారు. ఇది అతి ప్రాచీన ఆలయం. 1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్‌నిర్మించాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ ఈ ఆలయంపై దాడిచేసి ధ్వంసం చేశాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా ఇక్కడి తెలుగు కన్నడ భాషా లిపిలో ఉన్న శాసనం చెబుతుంది. ఇక్కడ గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఈ ఆలయంలోని అఖండ జ్యోతి 400 ఏండ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతారు.

☸ *జైనాద్ ఆలయం*

: ఆదిలాబాద్‌కు 21 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం జైన మందిరాన్ని పోలి ఉంది.

♦♦ *సిరిచెల్మ సోమేశ్వరాలయం:*

ఇచ్చోడకు 14 కి.మీ. దూరం లో ఉంది. 7వ శతాబ్దానికి చెందిన సోమేశ్వరాలయంలో శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మత శిల్ప సంపద కలదు. ఇక్కడ శ్రీ కృష్ణ దేవరాయలు భార్యతో కలిసి అర్చన చేసినట్లుగా శాసనాధారం.

🔷  *నిర్మల్:*

దీని చుట్టూ దుర్గం కలదు. పూర్వం వెలమ రాజుల పాలనలో ఉండేది. ఇక్కడ మహదేవ మందిరం ఉంది.

♻♻ *కన్విట్ తాలూకాలోని మహుర గొప్ప చారిత్రక స్థలం*

. ఇక్కడ ప్రాచీన రేణుకాదేవి మందిరం ఉంది. ఈమెను ఏకవీరాదేవి అంటారు.
🔴🔴🔴🔴🔴🔴🔴🔴

*ఇతర చూడదగిన ప్రాంతాలు:*
 
1. రామకృష్ణాపురంలోని గాంధర్వ కొండ, పోచమ్మ ఆలయం,

2. కుంటాలలోని సోమేశ్వరాలయం,

3. సిరిసిల్లలోని వేంకటేశ్వరాలయం,

4. బెల్లంపల్లిలోని బుగ్గరామేశ్వరాలయం, నిర్మల్‌లోని మహదేవాలయం.

💥💥 *ఏడు జలపాతాలు*: 

బోధ్ నియోజకవర్గంలో 15 కి.మీ. పరిధిలో 7 జలపాతాలు కలవు. అవి:1. కుంటల 2. పొచ్చెర 3. లఖంపూర్ 4. గాజిలి 5. పొచ్చెల పాలధార 6. ఘన్‌పూర్ జలపాతం 7. కనకాయి జలపాతం........

💥💥 *జమలాపురం*

(తెలంగాణ తిరుపతి): ఇది ఎర్రుపాలెం (మం)లో ఉంది. వేంకటేశ్వరస్వామి దేవాలయం సూదిబోడపై కలదు. స్థల పురాణం ప్రకారం ఇక్కడి రెండు గుహలలో ఒకటైన వైకుంఠ గుహలో జాబాలి మహర్షి తన శిష్యులకు వేదం నేర్పాడని కథనం. మరొక గుహ పేరు కైలాస గుహ. ఈ దేవాలయాన్ని కాకతీయుల కాలంలో కట్టిఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

💥💥 *శ్రీ బాలజీ*
వేంకటేశ్వరస్వామి: అన్నపురెడ్డిపల్లిలో ఉంది. ఇది ఖమ్మం జిల్లాలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. అన్నపు రెడ్డి అనే కాకతీయ సేనాపతి నిర్మించిన ఆలయాన్ని 1870లో వెంకటప్పయ్య పునర్‌నిర్మించాడు. మీర్ మహబూబ్ అలీఖాన్ అనే సుల్తాన్ పాలనా కాలంలో కాళ్లూరి వెంకటప్పయ్య మైసూరు ప్రాంతం నుంచి వలస వచ్చి దేవాలయాన్ని నిలబెట్టాడు.

✨💥 *నీలాద్రి ఆలయం:*

 దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇది 1996 -97 సంవత్సరాల మధ్య దట్టమైన అడవుల నుంచి బయటపడింది. ఇక్కడ శివరాత్రి ఉత్సవం బాగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న జెండా గుట్ట కాకతీయుల విజయాన్ని తెలుపుతుంది.

💥💥 *రామాలయం*

(వనం కృష్ణాలయం): ముదిగొండ (మం) వనం కృష్ణరాయలు కట్టించినందున ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది.

💥 *కూసుమంచి శివాలయం:*

 ఇది కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయం చుట్టూ నిర్మించిన కళా ఖండాలు రమణీయమైనవి.
👏👏👏👏👏👏    👏👏      

ఐశ్వర్య  మంచి  అందగత్తే  .   ఆమె  భర్త  హరీష్   కూడా  అందగాడే . చూడ  చక్కని  జంట .  ఆన్యోన్యమైన    కాపురం   .  వాళ్ళను  చూసి   అందరూ  ముచ్చట  పడేలా  ఉండేవారు .
.
.
అనుకోకుండా   వాళ్ళ  జీవితాలలో   ఒక  విషాదం  జరిగింది
.
.
ఏమయిందో  తెలీదు  
.
ఐశ్వర్యకు   చర్మం  కాలినట్టు  రంగు  మారిపోతోంది .  ఆమె  అందమైన  ముఖం   కూడా  చర్మవ్యాదివలన రూపం  మారిపోవడం  మొదలు  పెట్టింది  .  ఆమె  అందం  అంతా  ఏమయిపోతోందో   ఆమెకే  అర్ధం  కావడం  లేదు .  డాక్టర్  లు  ఏమీ  చెప్పలేకపోయారు .
.
ఒక  రోజు హరీష్   ఆఫీస్  పని  మీద   టూర్  వెళ్ళాడు .  రిటర్న్  లో  వస్తూ  ఉంటె   ఆక్సిడెంట్  అయింది .  అతడి  రెండు  కళ్ళూ  పోయాయి .
.
ఐశ్వర్య  దుఃఖానికి  అంతే  లేదు  
.
అయితే  ఒక   అదృష్టం  .  వాళ్ళ  కాపురం  లో  కలతలు  లేకుండా  ముందు  లాగే  సాగుతోంది .  అతడికి  కళ్ళు  పోయాయని  ఆమెకు  చింత  లేదు  .  ఆమె   కురూపిగా  మారినా  హరీష్  కు  తెలియలేదు .
.
ఆమె  వ్యాధి   ముదిరిపోతోంది .  చర్మం  అంతా  కమిలిపోయి  సాదా  సీదా  పనులు  చెయ్యడానికి   కూడా  కష్టం  అయిపోతోంది .  గతాన్ని  తలచుకొని  ఆమె   ఎంతో  బాధ  పడుతోంది .  తన  బాధను  తనలోనే  అణుచుకొని  హరీష్  తో   మునుపటిలాగే  ఉంటోంది .
.

.
ఒక  రోజు  ఉదయానికి   ఐశ్వర్య   ఇంక  లేవలేక  పోయింది .  ఆమె  బాధను  చూడలేని  హరీష్  ఆమెకు  జ్వరం  వచ్చింది   అనుకుని   తోచినంతలో    అనీ  తానే  చేశాడు .   ఆమె  ఆ  సాయంత్రం  మరి  లేవలేదు .
.
.
హరీష్  ఆమె  కర్మకాండలు  అన్నీ  చేశాడు .  ఆమె లేని  ఇంట్లో  ఎలా  గడపడం ?
.
.
ఒక్కడే !
.
.

.
ఒక  రోజు  సామాను  అన్నీ  సర్దుకుని  వెళ్లిపోతుంటే  పొరుగు    ఉన్న  పవన్  వచ్చి  ఎలా  బ్రతుకుతారు ? ఇక్కడ  మీకు  అందరూ  తెలిసిన  వారు  కదా !  వేరే  చోట  మీకు  ఇబ్బంది  అవుతుందేమో ?  ఆలోచించండి  అన్నాడు .
.
.

.
‘నేను  గుడ్డివాడిని   కాను  పవన్ !  నా  భార్య  బాధ  పడకూడదు  అని  గుడ్డివాడిలా  నటించాను . తన  శరీరం  రంగు  మారడం   నాకు  తెలియనట్టు  నటించాను .  నాకు  తెలిస్తే  ,  నేను  తనకు  దూరం  అయిపోతాను  అని  తను  ఆత్మహత్య  చేసుకుని  ఉండేది పవన్ . తన శరీర  బాధ  కన్నా   నేను  ఏమన్నా  అనుకుంటానేమో  అనే  బాధ  ఆమెకు  ఎక్కువ  అయి  ఉండేది .   ఆమె  నన్ను  అంతగా  ప్రేమించింది .  ఆమెను  సంతోషంగా  ఉంచడం  కోసం  నేను  నటించాను .  ఆమె  తృప్తిగా  మరణించింది   .  అది  చాలు  నాకు   “
.
.
.
.

ఏమనుకుందాం ?
.
.

నిజమైన సంతోషం   ఎదుటివారిని  సంతోష  పెట్టడం  లోనే  ఉంది  అని  ఆచరణలో  చూపిన  హరీష్  వంటి  వారు  మనలో  కూడా  ఉండే  ఉంటారు  కదూ !
.
.
నచ్చితే  ఒక  మంచి  మాట  , 
.
వీలయితే   పదిమందికీ  పంచండి .
............🌹.............

*నిజమైన సంతోషం   ఎదుటివారిని  సంతోష  పెట్టడం  లోనే  ఉంది*
👌
🙏
Let we all practice this😀

18 Simple Lessons From The Bhagavad Gita That Are All You Need To Know about life

The pathway of pain feeling

Actress Himaja chi chat with her fans -1

This story takes one minute and will change the way you think about things forever...

The most expensive liquid on Earth!

Sunday, January 29, 2017

A better music composer than anu malik 😂😂👇

రిటైర్మెంటు రోజు ఆఫీసులో భారీగా ఏర్పాట్లు చేసారు.  పెద్దాధికారులు, యూనియన్ నాయకులు సత్కారసభకి వచ్చి సుందరయ్య సేవలను కొనియాడారు.  చివర్లలో సుందరయ్యపిల్లలు మాట్లాడుతూ సుందరయ్య సంతానంగా తాము జన్మించటం తమ అదృష్టం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.తన పిల్లలు ఇంత బాగా మాట్లాడుతారా అని సుందరయ్యే ఆశ్చర్యపోయాడు.
తనకి జరిగిన సత్కారానికి  కృతఙ్ఞతలు తెలుపుతూ సుందరయ్య “తనకి ఇంతా భారీగా సత్కార సభ జరగటం వ్యక్తిగతంగాఇష్టం లెకపొయినసరే, పది మందికోసం ఒప్పుకోక తప్పలేదంటు”తన అనుభావాలను ముచ్చటించి కష్టపడి పనిచేసి సంస్ధ అభివృద్ధికి పాటుపడాలనీ, సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికాడు. చివర్లో తనకి రావలసిన పి.ఫ్., గ్రాడ్యుయిటి, వగైరా  అన్నింటికీ సంబధించిన చెక్కులు సుందరయ్య చేతికి అందించారు.  సభ ముగిసిన తర్వాత అక్కడే విందు ఏర్పటు జరిగింది.  కార్యక్రమాలైన తర్వాత కార్లో ఇంటికి సాగనంపారు.  రాత్రి ఇంటికి చేరిన తర్వాత పిల్లలు ఆఫీసులో జరిగిన సన్మానం గురించి మాట్లాడుకుంటుండగానే  సుందరయ్యకి వెంటనే నిద్ర పట్టేసింది.
మర్నాడు బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లు  అన్నీ సెటిల్ చేసుకున్నాడు.  మిగిలిన డబ్బుని అకౌంటులో వేసుకుని, పిల్లల విషయం తేలిన తర్వాత ఏంచెయ్యాలో అప్పుడు అలోచించొచ్చని ఇంటికి తిరిగొచ్చాడు.  అలాగే, తానే పిల్లల్ని పిలిచి ఉన్న విషయాన్ని చెప్పి ఓ నిర్ణయానికి రావటం మంచిదని భావించాడు.

అటూ సుందరయ్య కొడుకు, కూతురు కూడా తండ్రితో విషయం ఎలా చెప్పాలా అని ఆలొచిస్తున్నారు. అందరి పిల్లలాగే వాళ్ళకి తండ్రి దగ్గర భయం ఎక్కువే. ఒకొక్కసారి తండ్రి తీసుకునే నిర్ణయాలను మార్చడం కష్టం. కొన్ని సందర్భాలో ఆయన గీసుకున్న గిరిని దాటి వచ్చేవారుకాదు. ఆ విషయంలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇచ్చేవారుకాదు. తండ్రి సిద్ధాంతలు చాలా ఉన్నతమైనవే.. కాని ఈ రోజుల్లో వాటిని నిత్యజీవితంలో పాటించడం కష్టం.  అందుకే పట్టువిడుపులు ఉండాలి. రోజులతోపాటూ మనం కూడా మారాలి.   అంతేకాని సమాజాన్ని మార్చటం మన తరంకాదు.. అని తండ్రికి చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. అలాని అయన అభిప్రాయాలు మంచివి కావని కూడా అనలేరు.

ఎవరు ఏమడుగుతారనే టెన్షన్ తోనే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది.
"వాళ్ళు ఎమైనా నీతో అన్నారా?" అంటూ రాత్రి పడుకోబోయేముందు సుందరయ్య భార్యని అడిగాడు.
"అబ్బే.. నన్నేం అడగలేదు.  ఆడిగినా నేనేం మాట్లడతాను?  ఆ విషయం వాళ్ళకి తెలుసు."
ఆ మర్నాడు సాయంత్రం పిల్లలు వెళ్ళిపోతారు.   ఈలోగా ఎదోవకటీ తానే చెయ్యాలి. సుందరయ్య ఏదో ఆలోచన స్పురించటంతో నిద్ర పట్టేసింది.  ఉదయమే ఇంట్లోందరిని పిలిచాడు సుందరయ్య.
"నేను,  అమ్మ ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం.  పుట్టి పెరిగిన ఊరు వదలి రావాటం కుదరదు. నాకు పెన్షన్ వస్తుంది. అది మాకు సరిపోతుంది.    నా రిటైర్మెంటు  డబ్బులతో అప్పులు తీర్చగా మిగిలినవి మొత్తం  ఇవి! మాకు ఏమైనా అవంతరాలు వస్తే అవసరార్దం కొంచెం డబ్బులు మాకువుంచి  మిగతావి మీరిద్దరు తీసుకోండి.  ఇదిగో  బ్లాంక్ చెక్కులు. నేనివ్వగలగింది ఇదే!" అంటూ సుందరయ్య ఓ కాగితం మీద లెఖ్ఖలు రాసి, చెక్కులు  వాళ్ళ చేతిలో  పెట్టేడు.
వసంతమ్మకి భర్త అలోచన నచ్చింది.  నిజమే..అంతర్నిస్టూరం కంటే ఆదినిస్టూరం మంచిది. అయితే  ఆయన మాటలు మిగాతావాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు. అయన ఏ విషయమైన అంత సూటిగానే చెప్పేస్తారు .
"వద్దు నాన్నా.   మేం వచ్చింది మీ రిటైర్మెంటు సమయంలో మీతో నాలుగు రోజులు గడపడానికి వచ్చామే గాని ఆస్తులు పంచుకోడానికి కాదు!! మాకు ఆర్ధిక సమస్యలు గాని, అవసరాలుగాని లేవు. నిజంగా మాకు అవసరమైతే మీ దగ్గర తీసుకోడానికి మాకు మొహమాటం ఎందుకుంటుంది నాన్నాగారూ! ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హయిగా ఉండండి" అంటూ అబ్బాయి చెక్కుల్నితిరిగి  తండ్రి చేతితో పెట్టీసాడు.
అంతే! ఒక్క నిమిషంలో వాతవరణం చల్లబడిపాయింది.  అందరి ఉహాలు ఓ రకంగా ఉహలుగానే ఉండిపోయాయి .
"అన్నట్లు.. నాన్నగారు మనందరం కలిసి ఓసారి మన కోనేరుగట్టుకి వెళ్ళొద్దాం.  మన పాతిల్లు, ఆ వీధి చూసి చాల కాలమయింది" అన్న కొడుకు మాటలు వినేసరికి సుందరయ్యకి ఆనందం వేసింది.
"నిజమేరా! మేం కుడా ఆ గట్టుకి వెళ్లి చాల కాలమయింది " అంటూ అందరు బయలుదేరారు.
"అబ్బా! మన వీధి చాలా మారిపోయింది ."
"అవున్రా. ఈ  వీధిలో అందరూ ఇళ్ళు అపార్టుమెంట్సుకి ఇచ్చేసారు.  ఒక్క మనం అద్దెకుండేవాళ్ళమే.. ఆ ఇల్లే అలాఉంది. ఈ మధ్య  ఆ ఇంటివాళ్ళు అమ్మెస్తే, ఎవరో కొనుక్కొని రిమోడల్ చేయించారుట. మొక్కలు, చెట్లు పాడావకుండా అలాగే వున్నాయి! ఎవరో మంచి వాళ్ళల్లా ఉన్నారు! ఇంటి స్వరూపాన్ని పాడుచేయకుండా, బాగుచేయించారు. బావుంది!" అలా కబుర్లు చెప్పుకుంటూ కోనేరు నాలుగు గట్లు తిరిగి, ఇంటికొచ్చేసారు.
ఆ రోజు సాయంత్రమే పిల్లలు ప్రయాణాలు.
‘ఏవిటో! వారం రోజులూ ఏడూ క్షణాల్లా గడిచిపోయాయి!’ అనుకుంటూ వాళ్ళతోపాటు రెల్వేస్టెషన్ వెళ్లి , వీడ్కోలు చెప్పి ఇంటికొచ్చిసారు సుందరయ్య, వసంతమ్మ.   ఇంటికికొస్తూనే టేబులుమీద కవరు చూసి సుందరయ్య అశ్చర్యపోయాడు. నాన్నగారికి అన్న అక్షరాలు చూసి ఆత్రుతగా కవరుచింపి చదవసాగారు.
నాన్నగారికి,
మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక ఈ ఉత్తరం రాస్తున్నా౦.  మరోలా భావించకండి.   మీరు పడ్డ కష్టలు మేం పడకూడదని, మమ్మల్ని చాలా అపురూపంగా పెంచారు! దానికితోడు మారిన రోజులతోపాటు మేం కూడా మారిపోయం. యాంత్రికయుగంలో ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని చాలా సుఖమయం చేసుకున్నాం.  కాలంతోపాటు పరుగులు తీస్తున్నాం! కాని మేం చాలా కోల్పోయం నాన్నగారు!! బాల్యం మాకు తెలియదు. యవ్వనంలో మాకు మంచి అనుభూతులు లేవు. అనుబంధాలు, ఆత్మీయతలు అంటే మాకర్ధం తెలియదు. మేం పరిగెత్తుకుంటూ పాలు తాగుతున్నాం,  కాని నీళ్ల రుచి తెలియదు!  మీ తరంవాళ్ళు గుర్రంస్వారీ చేసేవారు.  మేం పులిస్వారీ చేస్తున్నాం.  మీరు జీవితాన్ని కాచివడపోసారు. మేం జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం.  మీరు పెద్దలమాటలు వినేవారు. మేం కంప్యూటర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం!! అమ్మ ఎప్పుడూ  అంటుందే.. అలా మేం గోరిలు కట్టుకుని జీవిస్తున్నాం నాన్నగారు!!
ఒక్క విషయం చెప్పగలంనాన్నగారు! మీ పెంపకంలో లోపం లేదు.  మేం పెరిగిన వాతవరణంలో లోపం ఉంది!  మా దగ్గర సముద్రమంత మేధస్సు ఉంది. కాని ఆ మేధస్సుతో  గుక్కెడు నీళ్ళు కూడా తాగలేం! మీ మేధస్సు కోనేరంతే .. అయితే నేం .. అదంతా మంచినీరు!!.  ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీమ్మల్లి ఈ రొంపిలోకి లాగదలచుకోలేదు! మీరు ఎప్పుడూ స్వప్నలలో జీవించలేదు.వాస్తవాలతో జీవనం సాగించేరు! మీకు మనుషులతోనేకాదు, మీ పుట్టి పెరిగిన నేలతోకూడా బంధాలున్నాయి. చెట్టులు, పశువులు,పక్షులు  అన్నిటితో మీకు అనుబంధాలున్నాయి! వీటితోపాటు చివరికి మనం పాతికేళ్ళు అద్దెకున్న ఇంటిమీద కూడా  మీకు మమకారం ఉంది!! వీటిని వదులుకోలేక, ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకోకుండా ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు!

అందుకే  మమ్మల్ని మీ వాస్తవ జీవితాల్నుంచి దూరం చేయటం ఇష్టంలేక, మీ అనుభందాలను త్రుంచటం ఇష్టం లేక, మీకు తెలియకుండా ఓ పని చెసాం!!  అక్కా, నేను కలసి మన కోనేరు గట్టులో మన గతంలో ఉన్న ఇంటిని మీ గురించి కొన్నాం. ఈ ఉత్తరంతో పాటున్న తాళంచెవి ఆ ఇంటిదే!! మీరు ఆ ఇంటిలోకి మారి, స్వేచ్చగా, హాయిగా  ఉండాలనేదే మాకోరిక! 

అన్నట్లు, ఇంకో అభ్యర్ధన కూడా ఉంది నాన్న!! త్వరలో మాకు పుట్టె పిల్లల్ని మమల్ని పెంచినట్టు కాకుండా,  మీరు పెరిగినట్టు పెంచి,  పెద్దచేసే బాధ్యతని మీకే అప్పగిస్తాం. మన గట్టు మీద పెంచండి. అంటే మాకు  తీరిక లేక, పెంచలేక కానేకాదు!!  మా స్వార్దం అంతకంటే కాదు!!  వాళ్ళు మేం పెరిగినట్టు పెరగకూడదు. మీరు పెరిగినట్టు పెరగాలనే మా ఆశ! వాళ్ళు యంత్రాలు కాకూడదు, వాళ్ళు మనుషులగానే ఎదగాలి! 
ఓ విషయం చెప్పమా నాన్నా! మీలాంటి వాళ్ళ చేతులలో పిల్లలు పెరగడం, భవిష్యత్తులో మనిషి మనుగడకి చాల  అవసరంనాన్న! కాదనరుగా!!
ఇట్లు
మీ అమ్మాయి, అబ్బాయి.

ఉత్తరం చదివిన సుందరయ్య కళ్ళు  కోనేరుతో నిండిపోయింది!  అ కళ్ళతోనే వసంతమ్మ కళ్ళల్లో వసంతాన్ని చూసాడు. వంటింట్లో కాకులు, పెరట్లో కోయిలలు హడావిడిగా కనిపించేయి.
అయ్యకోనేరు మాత్రం ఆనందబాష్పాలు రాల్చింది!!