Pages

Wednesday, January 4, 2017

హిందూ ధర్మములో కలియుగము లో వుండే రాక్షసుల గురించి ఈ కింది విధముగా చెప్పబడినది.
హిందూ ధర్మములో కలియుగము లో వుండే రాక్షసుల గురించి ఈ కింది విధముగా చెప్పబడినది.

1. చుట్టూ ఉన్నవారికి కంటకముగా మారినవాడు.

2. యుక్తాయుక్త విచక్షణ లేక చెప్పుడు మాటల విని ఇతరులను రాక్షసముగా పీడించేవాడు.

3. ఇతరులను ఆకారణముగా దుషిస్తూ ధర్మ సూత్రములు వల్లించేవాడు.

4. సహాయం పొందుతూ కూడా కృతజ్ఞత చూపకుండా నిందలు వేసేవాడు.

5. శరీర కష్టం లేకుండా తిని పడుకునే సోమరిపోతు.

6. దయ చుపినవాడిని మాటలతో కుల్లపోడుచువాడు.

7. తన సంతానమును ఆకారణముగా దూషించు వాడు.

8. వావి వరసలు లేక మ్రుగామువలె తన సోదర/సోదరిల  యొక్క భార్య/భర్తలను తిట్టువాడు.

9. తన మంచి కోరి చెప్పిన విషయాలను తనని చులకన చేయుటకు చెప్పిన విషయలుగు నిందలు వెయ్యువాడు.

10. ఎంత సేవ చేసినాను తనకు ఎవరు ఏమి చేయుటలేదని ఏడ్చువాడు.

11. జీవితము మీద ముందు చూపుతో ఇతరులు చేసుకునే కష్టాన్ని హేళన చేసేవాడు.

12. చెడ్డ భార్య మాటలు విని కన్నా తల్లిని దూషించి కొట్టేవాడు.

13. ఇతరుల వస్తువులను తన అవసరానికి వాడుకొని, అవసరము తీరిన తరవాత ఆ వస్తువు నాసిరకముదని, మోసపురితమైనదని దురద్రుష్టకరమైనదని నిందలు మోపేవాడు. 

15. తనకు సంబంధించిన కార్యక్రమాలకు అందరు సంతోషముగా కులిలవలె సేవలు చెయ్యాలి కాని ఇతరులకు సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమూ ఎవరో చచినట్టు మోహము పెట్టుకొని కుర్చునేవాళ్ళు. ఎ సహాయము చేయ్యనివాళ్ళు.

16. మోహము మీద చిరునవ్వు కూడా లేకుండా బ్రతికేసేవాడు.

17. తన చాతకాని తనము వల్ల  ప్రపంచము మీద పగ పెంచుకునేవాడు.

18. తనకు కోపం వచినప్పుడు అందరు భయపడాలి తనకు సంతోషం వచినప్పుడు అందరు సంతోషముగా వుండాలి అనుకునేవాడు.

19. పట్టరాని కోపముతో ఇతరులను ఎల్లప్పుడూ దుషిస్తూ, ఇతరులు మాత్రం ఏమి జరగనట్టు సాదారనముగా వుండాలి అనుకునేవాడు. పైనుండి అట్లా ఉండని వాళ్ళు తనని చులకనగా చూస్తున్నారని నిందలు మోపేవాడు.

20. ఏ క్షణానికి ఆ క్షణం బురదలో దొరిలే పంది వలె గడిపేస్తూ, కొంచము కూడా మూడు చూపు లేకుండా  గడిపేసే పశువు వంటి వాడు.

21. ఇతరులు జీవితమున సంతోషముగా వుంటే అధర్మము చేస్తున్నారని నిందలువేసేవాడు.

22. అన్నం పెట్టె చేతిని కాల్చేవాడు.

23. కనీస ప్రయత్నము చెయ్యక తనకు తగనివారి తో పోటి పడి, వారిని దుషించేవాడు.

24. తనకున్న శారీరిక రోగమును అడ్డము పెట్టుకొని అందరిని బెదిరించేవాడు.

25. నిత్యము కోపము ఆశనముతో రగిలిపొఎవాదు.

26. ఆకారణముగా ఇతరులను బూతులు తిట్టేవాడు.

హిందూ ధర్మము ప్రకారము కలియుగములో ప్రత్యక్షముగా రాక్షసులనే వారు వుండరు కాని, పైన చెప్పినట్టి వారు రాక్షసులకంటే క్రురమైనవారని, వారిని రాచపుండుతో సమానముగా చూడాలని చెప్పబడి వున్నది.

కావున తస్మాత్ జాగ్రత్త...!!!

No comments:

Post a Comment