Pages

Thursday, February 16, 2017

కీరదోస మిల్క్ షేక్

కీరదోస మిల్క్ షేక్

కావలసిన పదార్థాలు :
కీరదోస - నాలుగు
పాలు - ఒకటిన్నర లీటర్
చక్కెర - 200 గ్రా.
యాలకుల పొడి - అరచెంచ
జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా - అన్నీ కలిపి 75 గ్రా.
నెయ్యి - రెండు చెంచాలు

తయారుచేసే పద్ధతి :
కీరదోస చెక్కుతోపాటు గింజల్నీ తీసేసి మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి.
ఓ గిన్నెలో పాలు తీసుకొని, చక్కెర వేసి పొయ్యి మీద పెట్టాలి. అవి మరిగాక అందులో కీరదోస గుజ్జు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి అది చిక్కబడుతుంది.
ఓ బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా పలుకుల్ని వేయించుకోవాలి. ఎండు ద్రాక్ష తప్ప మిగిలిన అన్నీ పలుకుల్ని మెత్తగా కాకుండా పోడిలా చేసుకోవాలి.
ఇప్పుడు ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి పాలల్లో వేసి వేసి మళ్ళీ కలిపి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

No comments:

Post a Comment