Friday, January 27, 2017
ఒక రోజు టీచర్ క్లస్ లొ సరదగా ఇలా అడుగుతుంది
"స్వర్గం నుంచి ఎవరైన మట్టి తెస్తారో నేను వాల్లకి బహుమతి
ఇస్తా అని !!!!!
.
.
.
ఆ మరుసటి రోజు....
అందరిని అడుగుతుంది.
ఏవరైనా మట్టి తెచ్చారా???....
క్లస్లొ విధ్యార్తులందరు నిశ్హద్దం ఉంటారు
ఇంతలొ ఒక విద్యార్థిని టీచర్ దగ్గరకు వెళ్ళి తన చేతిలొ ఉన్న
మట్టి ని చుపిస్తుంది...
.
.
టీచర్ కి కొపెం వచ్చి అ అమ్మాయిని కొట్టీ,
అడుగుతుంది
.
.
టీచర్ :ఇడియట్ట్ ,నన్ను పిచ్చి దాన్ని చెద్దం అని ఈ మట్టి
తీసుకుని వచ్చావా,
చేప్పు యెక్కడి నుంచి తే్చావు ఈ మట్టి....???!!!
.
.
అ పిల్ల ఎడుస్తూ ,చేప్తుంది...
"టీచర్ ఈ మట్టిని మా అమ్మ పాదాల కింద నుంచి తీసుకుని
వచ్చా"....!!!
.
.మీరె చేప్పారు కదా మేడం అమ్మ నడిచిన చొటు స్వర్గంతొ
సమానం అని....
టిచర్:నువు మీ అమ్మగారి పేరేంటి
స్టూడెంట్:నేను ఎప్పూడు పేరు అడగలేదు
ప్రేమతో అమ్మ అని పిలుస్తాను అని చెప్పింది నవ్వుతూ... నవ్వుతూ <3
ఒక రొమాంటిక్ కథ.....
ఒక రొమాంటిక్ కథ.....
ఒక రాజు తన సైనికులతో పాటు ఒక చెరువులో స్నానం చేయటానికి వెళ్ళాడు
అక్కడ కొందరు స్త్రీలు ముందే స్నానం చేస్తున్నారు,
రాజుని సైన్యాన్ని చూడగానే వాళ్ళందరూ బయటకి వచ్చేశారు ,
అందులో ఓ అమ్మాయి రాజుకు బాగా నచ్చింది..!!
రాజు తిరిగి తన రాజమహల్ కి వచ్చేశాడు,
కానీ పదేపదే ఆ అమ్మాయే అతనికి గుర్తు వస్తుంది,
అతని మనసు మరే ఇతర విషయంపై లగ్నం అవట్లేదు,
రాత్రి అయింది.....
రాత్రంతా ఆ అమ్మాయి గురించే రాజు ఆలోచిస్తున్నాడు,
ఇపుడు మీరు ఆలోచించినట్లుగానే
ఉదయం లేవగానే ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకుని రమ్మని తన సైనికులని ఆదేశించాడు,
సైనికులకి తెలిసిందేమిటంటే,
ఆ అమ్మాయి తండ్రి వ్యాపారి అని,
రాజు వ్యాపారిని రాజ దర్బార్ కు ఆహ్వానించాడు.
4 రోజుల తర్వాత కూడా వ్యాపారి రాలేదు,
రాజు మళ్ళీ పిలిచాడు,
ఈ సారి ఎనిమిది రోజులు చూసినా ఫలితం లేకపోయింది,
రాజుకు కోపం వచ్చింది...
మరియూ....
అతను వ్యాపారిని బలవంతంగా బంధించి తీసుకురమ్మని సైనికులని పంపాడు .,..
వాళ్ళు వ్యాపారి ఇంటికి వెళ్ళేసరికి తాళం వేసి ఉంది....,
రాజు వ్యాపారిని వెతకాల్సిందిగా తన సైనికులకి ఆదేశం ఇచ్చాడు.....
సైనికులెంత వెతికినా వ్యాపారి దొరకలేదు
కనీసం అతని జాడ అయినా లేదు.....
అప్పుడు ఓ రాజాఙ్ఞ జారీ చేశారు......
మరియూ.....
చాటింపు వేశారు వ్యాపారి ఆచూకీ తెలిపినవారికి కిలో బంగారం ఇస్తామని
.....
కొన్ని రోజులు గడిచాయి.....,
వ్యాపారి దొరకలేదు.
వారం అయింది.....,
అయినా వ్యాపారి దొరకలేదు.....
ఒక నెల అయినా వ్యాపారి దొరకలేదు....
వ్యాపారి దొరకకపోతే రాజ్య ప్రజలందరినీ శిక్షిస్తా అని రాజు ప్రకటించాడు.....
అయినా వ్యాపారి దొరకలేదు....
చివరికి రాజు పక్క రాజ్యాల సహాయం కోరాడు,
వారంతా వారివారి దేశాలలో వ్యాపారిని వెతికారు,
వ్యాపారి దొరకలేదు....
రాజు నీరసించిపోయడు,
ఓ రోజు రాజుకి ఓ కల వచ్చింది,
కలలో ఓ సరస్సు కనపడింది
కలలోనే ఆ సరస్సుకి వెళ్ళాడు,
కానీ అక్కడెవరూ లేరు,
నిరాశపడి వెనక్కి తిరిగి వస్తుంటే అక్కడొక సాధువు కనపడ్డాడు,
అతను ఆ సరస్సుకు అవతలి వైపు ఓ కుటీరం ఉందని
అందులోకి వెళితే నీవు వెతికేది దొరుకుతుందని అన్నాడు
రాజు నిద్ర లేచి సైనికులతో కలసి ఆ సరస్సుకి వెళ్ళాడు,
స్వప్నంలో కనపడిన కుటీరం చూశాడు,
రాజు ఆనందభరితుడయ్యాడు,
ఆ కుటీరంలోకి వెళితే ఓ వృద్ధుడు,అమ్మాయి కనపడ్డారు
కానీ ఆ అమ్మాయి కురూపి....
ఆమె తండ్రి నిరుపేద.....
ఇప్పుడు కూడా వ్యాపారి దొరకలేదు,,
ఆఖరికి తిక్క పుట్టి సైనికులందరినీ వదిలేశాడు.....
మరియూ..,.
కేసు CBI కి అప్పగించాడు ,
అయినా వ్యాపారి దొరకలేదు,
చివరికి రాజుకి,
అతని సైనికులకి,
ఇతర రాజ్యాల వారికీ....
మరియూ...
CBI వారికీ వ్యాపారిని వెతకటంలో ఎంత సమయం వృథా అయిందంటే.....
ఎంత అంటే....
ఇప్పుడు మీరు ఈ పోస్టు చదవటంలో వృథా చేసిన సమయమంత..
ఇందులో ఏ అర్థమూ లేదు.
కోపం తెచ్చుకోకండి,
నాకు కూడా ఇలాగే అయింది ..!!
మీరు కూడా ఈ పోస్టు ఎవరికి అయినా పంపి ప్రతీకారం తీర్చుకొండి !
వ్యాపారి దొరికితే చెప్పటం మరవకండి ......
అతని కూతురు చాలా అందమయినదసలే .
.!😂😂😂
😂��😎�
ఆమె పేరు జబర్దస్త్ వినోదిని
ఒకానొక రాజ్యంలో, రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు.
రాజు:
" మన రాజ్యంలో
మహా తెలివైనవారు వున్నట్లే,
మహా తెలివితక్కువ వాళ్లూ వుంటారు కదా ?"
మంత్రి (సంశయిస్తూనే):
"అవును వుంటారు ప్రభూ!"
రాజు:
" ఐతే, మన రాజ్యం అంతా గాలించి, అందరిలోకి అతి తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొని, ఇక్కడ సభలో హాజరు పరచండి" అని ఆదేశించాడు.
మంత్రి:
"చిత్తం ప్రభూ" అని సభనుండి నిష్క్రమించాడే కానీ మనసంతా ఎలా అన్న ఆలోచనలతోనే మస్తిష్కమంతా నిండిపోయింది.
ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో
వాడు తెలివయిన వాడో, కాదో తెలుసుకోవచ్చు.
మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?
ఈ సందిగ్దావస్త నుండి బయటపడటమెలాగో అర్ధం కావటంలేదు మంత్రిగారికి. ఒప్పుకున్నాక తప్పదుగా! రాజాజ్ఞమరి.
ఒక నెల రోజులపాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.
రాజు:
" మహామంత్రీ! మీరు పొరబడినట్లున్నారా లేక లెక్క తప్పారా?
మేము ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాము. కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకొనివచ్చారు"?
మంత్రి:
" మహా ప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి"
రాజు:
" సరే! సెలవియ్యండి"
మంత్రి:
" నేను రాజ్యమంతా తిరిగాడుచుండగా...
ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్దమూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకు అని అడుగగా, తలపైనున్న మూట, బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది అని సమాధానమిచ్చాడు. అందుకే అతనిని ఐదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను".
రాజు:
" భేష్! తరువాత?"
మంత్రి:
" ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి, తన గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు.
" కావున ఇతన్ని నాల్గవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను".
రాజు:
" బహు బేషుగ్గా వుంది. తరువాత?"
మంత్రి :
" రాజ్యంలో చాలా సమస్యలుండగా, వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి, తెలివితక్కువ వాళ్లను వెతకటంలో నెల రోజుల పాటు సమయం వృధాచేసాను. కాబట్టి నేను మూడవ తెలివితక్కువ వాడిని."
రాజు ( గట్టిగా నవ్వుతూ ) " తరువాత ?
మంత్రి :
" పరిష్కరించాల్సిన సమస్యలుండగా, భాద్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరు రెండో వారు".
అది విన్న సభలొని వారంతా నిశ్చేష్టులై భయభ్రాంతులై చూస్తుండిపోయారు.
నిశ్శబ్దం ఆవరించింది సభలో.
రాజుగారు తేరుకుని కుతూహలం తో " మంత్రి గారు సందేహం లేదు. మీరు సెలవిచ్చినదాంట్లో వాస్తవానికి దగ్గరగానూ నిశ్సందేహంగా నిజాయితో కూడిన నిజముంది.
మరి మీరు మెదటి తెలివితక్కువ వారెవరో తెలియచెప్పండి"
మంత్రి:
చిత్తం మహా ప్రభో!
చెయ్యవలసిన పనులన్నీ మానేసి,
నెట్ ఆన్ చేసుకుని ఈ పోస్ట్ ని చదువుతున్నవాడే...
"ఆ మొదటివాడు."
తప్పక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మీరు మొదటివాడు కాదనిపించుకోండి.