Pages

Wednesday, June 1, 2016

పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు ముందుగా ఒక చిన్న కధ చెప్పుకుందాం. (పాపం శమించు గాక )

పురాణాలలో విడ్డూరాలు - నిజానిజాలు
ముందుగా ఒక చిన్న కధ చెప్పుకుందాం. (పాపం శమించు గాక )

ఏదో చిన్న గొడవ వలన క్రీ.శ.2090లో మూడవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఇంచుమించు అన్ని బలవత్తరమైన దేశాల వద్ద అణ్వాస్త్ర సంపద వున్నాయి. అందరూ యుద్ధంలో పాల్గొని ఒకరి మీదకొకరు ఈ అస్త్రాలు సంధించుకున్నారు. కొన్ని ఉత్తర దక్షిణ ధ్రువాల మీద కూడా పడ్డాయి. అక్కడున్న మంచుకొండలన్నీ కరిగిపోయి ఒక్కసారి మొత్తం ప్రపంచమంతా జలప్రళయంలో మునిగిపోయాయి. దాదాపు అన్ని దేశాలు నీటమునిగిపోయాయి. అన్ని భవనాలు అగ్నికీలలో దగ్ధమయి తరువాత జల ప్రళయం వలన మునిగిపోయి, ఎక్కడనుండో కొట్టుకువచ్చిన మట్టితో కప్పబడిపోయాయి. ఈ భీభత్సం ఒక పది రోజులు జరిగాక మరల మామూలుగా నీరు తీసేసింది.వాతావరణం అంతా మారిపోయింది. దేవుని దయ వలన కొందరు మాత్రం ఎత్తైన కొండ గుహలలో, కొన్ని జీవ జంతుజాలం గుహలలోనో ఎక్కడో నక్కి ప్రాణం దక్కించుకున్నారు. వారు బయటకు వచ్చి చూస్తె కొత్త ప్రపంచం, మొత్తం మారిపోయి కనబడుతోంది. ఆకలేస్తోంది. వారు చెట్టులు, పుట్టలు వెతికి వారికేమైనా దొరికితే తింటూ బ్రతుకుతున్నారు. వారిలో కొంతమంది కొన్ని గుహలలోను, లేదా వారిదగ్గరున్న పుస్తకాలలోనూ వారు చూసిన ప్రపంచం గురించి రాసారు. అప్పుడు రాకెట్స్ ఉండేవని, ఎలా ఉండేవో నమూనాలు రాసుకున్నారు, దూరంగా వున్నవాళ్ళతో ఫోన్లో మాట్లాడేవారని, టీ వీలు, ఇంటర్నెట్, వగైరా, వగైరా గురించి రాసుకున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి, ఎలా చికిత్స చేసేవారో, ఆపరేషన్లు, ఇతర జీవన ఆరోగ్యం గురించి ఎన్నో రాసుకున్నారు. అవన్నీ ఒక చోట భద్రంగా దాచుకున్నారు. నేడు వారికి తిండి దొరకడమే ప్రధానం. అన్నీ పోవడంతో వారు కేవలం కొన్ని ఆకులు కప్పుకుని బతుకుతున్నారు. వారికున్న జ్ఞానంతో కొన్ని ఇళ్ళు కట్టుకున్నారు. వారి సంతానానికి విషయం చెప్పారు. కానీ తిండి కోసం వారు మరిన్ని ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.

ఇలా ఒక పది తరాలు గడచి పోయాయి. అప్పుడు వారిలో ఒకడు వీరు ముందున్న ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కొన్ని పాడుబడ్డ ఆవాసాలు కనబడ్డాయి, శిధిలమై. వాటిలో వాడికొక పుస్తకం దొరికింది. దానిలో ఎలా జీవించాలో రాసుంది, అంతకు ముందు ఎలా జీవిన్చారో రాసుంది. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ తెగలో కొంతమందికి చెప్పాడు. భగవంతుడిని ఎలా ఆరాదిన్చేవారో తెలుస్కుని, వారు కూడా ఆ పద్ధతి పాటించారు. ఇదే భూగోళానికి అటువైపు కూడా కొంత మంది బ్రతికి బట్ట కట్టారు. వాళ్ళు ఎప్పుడో వీళ్ళను కలుసుకున్నారు. వాళ్ళు వీళ్ళ దగ్గరున్న పుస్తకాలలో విషయాల గురించి విన్నారు. అప్పట్లో గాల్లో వేల్లెవారట, ఇది నమూనా అంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. తిండే దొరకని మనకు ఈ కట్టు కధలు అవసరమా అంటూ గేలి చేసారు. ఈ తెగ వాళ్ళనందరినీ పిట్టకధల దొరలూ అని ముద్ర వేసారు. వారి జీవన విధానాన్ని వెక్కిరించారు. వారి గ్రంధాలను తిట్టారు. అప్పుడు విమానాలుంటే ఇప్పుడెక్కడికి పోయాయి. ఏది నువ్వొకటి తయారు చెయ్యి అన్నారు. కానీ అప్పుడు కరెంటు లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, ఏమి లేదు. వారికి ఆ జ్ఞానం లేదు. వీళ్ళు ఇప్పుడు ఆ పుస్తకాలలో విషయాన్ని ప్రాక్టికల్ గా చూపలేకపోతున్నారు కాబట్టి వీళ్ళవన్నీ కాకమ్మ కబుర్లు అని, వీళ్ళు వట్టి వెధవలోయ్ అని ముద్ర వేసారు. అవును నిజమే అని ఈ తెగలో కొంతమంది మిగతా వారిని ఎద్దేవా చేస్తున్నారు. ఆస్తిక నాస్తిక మతాలు పుట్టాయి. ఆ పుస్తకాలు నమ్మిన వాళ్ళు వెర్రి వెంగలప్పలు నమ్మనివాళ్ళు ఆధునీకులు అని పేర్లు పెట్టుకున్నారు.

పైదంతా చదివితే మీకేమైనా గుర్తుకొస్తోందా? ఈ రోజున జరుగుతున్న విషయం స్ఫురిస్తోందా? మన వాంగ్మయంలో చెప్పారు ఒకప్పుడు పుష్పక విమానంలో విహరించారట అంటే అదొక కట్టు కధ. ఒకప్పుడు రాజ్యాలలో ఈ విధంగా రాజ్యం చేసారట అంటే మరొక పిట్ట కధ. అస్త్ర, శాస్త్రాలతో యుద్ధం చెయ్యగలిగేవారట. సమయం ఇలా గణించారు, శస్త్రచికిత్సలు చేసారు, కుంభ సంభవులు పుట్టారు అంటే ఇవన్నీ mythology అని కొట్టి పారేస్తున్నారు. మంత్రప్రభావం, ప్రాభవం ఇదంటే దాని మీద నమ్మకం లేక చింతకాయలు రాల్చమంటున్నారు. జలప్రళయం వచ్చి అందరూ మునిగిపోతే ఒక మనువు బ్రతికాడని, తరువాత ఎందరో మహర్షులు వచ్చి మనకొక జీవన విధానం నేర్పారు అని మన పురాణం చెబుతోంది.. నిత్యసత్యాలన్నీ మన వాంగ్మయంలో, గ్రంథాలలో ఉన్నాయంటే నమ్మి పాటించిన వారు ఒక 8000 ఏళ్ళ క్రితం ఎలా వుండేవారో నేడు కొన్ని తవ్వకాలలో బయట పడ్డాయి. అదే మనకు అవతలి వైపు వాళ్ళు అప్పటికి అడవి పందులు వేటాడుకుంటూ వుండేవారు కనీసం 1000 సంవత్సరాల క్రితం వరకు. కాలక్రమేణా వారు కొన్ని కనిపెట్టారు, మనం అందరం వాడుకుంటున్నాం. అది నిజం, ఇదీ నిజం. కానీ పురాతన గ్రంథాలలో ఎలా ఉండేదో అప్పటి మన మనుష్యుల జీవనం, న్యాయం, ధర్మం జీవన విధానం, శాస్త్ర దృక్పధం ఆరోగ్య పరిరక్షణ విధానం అన్నీ రాసి వుంది. దేవుడిని ఎలా చేరాలని రాసి వుంది. దాన్ని నమ్మి పట్టుకున్న మనం తప్పక సాధించగలం. కావలసినదల్లా దాని మీద నమ్మకం. వారు చెప్పిన విషయాలను పూర్తిగా అర్ధం చేసుకోగల సామర్ధ్యం కావాలి. వాటి గురించి మనం మరింత లోతుగా పరిశీలించాలి. శోధించాలి, సాధించాలి. అంతేకానీ మనకు మనం తక్కువ అంచనా వేసుకుని మనం ఆత్మన్యూనతా భావం పనికిరాదు. మన మీద, మన గ్రంథాలపై, మన పురాణాల మీద మనకు నమ్మకం, గౌరవం వుండాలి. కాదంటారా?
మీకోసం ఈ లంకె.
http://timesofindia.indiatimes.com/…/articlesh…/52485332.cms

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Sunday, May 22, 2016

మోస్ట్ పవర్ ఫుల్ స్టొరీ!

మోస్ట్ పవర్ ఫుల్ స్టొరీ!
(ఇదొక ఈజిప్ట్ కథ .. ఈ కథ రాసిన రచయితను దేశం నుండి బహిష్కరించారట.)
ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది.
ఆడుతూ పాడుతూ పని చేసిది. అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది.
సీఈఓ సింహం రోజూ చీమని చూసి సంతోసించేవాడు.
ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు.
చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది, దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని. ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు, అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది. వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గా నియమించుకుంది. సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వలన ఎంత ఉత్పత్తి పెరిగింది, పని విధానానికి సంబంధించిని రిపోర్ట్ లు వగైరా అడిగారు. ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది. అది చేసే పనికి తోడు పై అదికారులతో మీటింగ్ లు, ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి.
ఈ లోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజర్, వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు, ఆర్భాటాలు మొదలైనాయి. క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది. ఉత్పత్తి పడిపోయింది. సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్లగూబ కి అప్పగించారు . ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్థితిిగతులని అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు. వెంటనే సింహం, బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి.
.

Saturday, April 30, 2016

నీ విలువ ఎంత --?

🌹నీ విలువ ఎంత --?🌹
=================

ఒక వ్యక్తి దేవునిని అడిగాడు ”నా జీవితం విలువ ఎంత” అని.
అప్పుడు దేవుడు అతనికి ఒక రాయిని ఇచ్చి “ ఈ రాయి విలువ తెలుసుకునిరా... కానీ దీనిని అమ్మకూడదు” అని చెప్పి పంపించారు.
ఆ వ్యేక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి నేను ఒక ఐదు పండ్లు ఇస్తాను, అమ్ముతావా ఏంటి అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ పండ్ల వ్యాపారి దగ్గరినుండి వెళ్ళిపోయాడు.
తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....
ఆ కూరగాయల వ్యాపారి ఈ రాయికి నేను ఒక పది కేజీల కూరగాయలు ఇస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు.

కానీ దేవుడు ఈ రాయి విలువను మాత్రమే తెలుసుకోమన్నారు, అమ్మమనలేదు. కనుక ఆ వ్యేక్తి ఆ కూరగాయల వ్యాపారి దగ్గరి నుండి కూడా వెళ్ళిపోయాడు.
తరువాత.... ఆ వ్యేక్తి ఒక బంగారు నగల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు.

ఆ బంగారు నగల వ్యాపారి ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఒక 50 లక్షాలు ఇస్తాను, నాకు అమ్మవా అని అడిగాడు. ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు చెప్పారు కనుక ఆ వ్యేక్తి ఆ బంగారు నగల వ్యాపారి దగ్గరినుండి కూడా వెళ్లిపోతుంటే ఆ నగల వ్యాపారి “సరే 4 కోట్లు ఇస్తాను” అని అడిగాడు.... ఈ వ్యేక్తికి కొంచం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదు అని దేవుడు ప్రత్యేకంగా చెప్పారు కనుక ఆ వ్యేక్తి అమ్మను అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

తరువాత.... ఆ వ్యేక్తి ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి ఆ రాయిని తీసుకుని వెళ్లి ”దీని విలువ ఎంత ఉంటుంది ? అని అడిగాడు....ఆ వ్యాపారి ఆ రాయిని పరీక్షించి “మీకు ఎక్కడిది అండి ఈ ఇంత విలువైన రాయి ? నేను నా ఆస్తిని, చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గరి నుండి ఈ సంపదను కొనటం నావల్ల కాదు అండి.... చివరికి ఈ ప్రపంచం మొత్తం అమ్మినా దీని విలువకు సరిపోదు” అని చెప్పాడు.

ఆ మాటలు వినగానే ఈ వ్యేక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు.... వెంటనే ఆ రాయిని తీసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు.... అప్పుడు దేవుడు.... నీ జీవితం విలువ ఏంత అని అడిగావు కదా.... ఈ రాయిని నువ్వు పండ్ల వ్యాపారిదగ్గరికి, కూరగాయల వ్యాపారికి, బంగారు నగల వ్యాపారికి చూపినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా ఆ విలువ వారి స్థాయిని బట్టి వారు నిర్ణయించారు.... కానీ నిజంగా ఈ రాయి విలువ తెలిసిన వజ్రాలవ్యాపారి మాత్రం దీని అసలు విలువనుకూడా చెప్పలేక పోయాడు.... నువ్వు కూడా వెలకట్టలేని ఈ రాయి వంటివాడివే.... నీ జీవితం కూడా వెలకట్టలేనిది.... కానీ మనుషులు వారివారి స్థాయిని బట్టి నీ జీవితానికి వెల కడతారు, నీ స్థాయిని బట్టి నిన్ను వెల కడతారు.... నువ్వు వారికీ ఉపయోగపడే విధానాన్ని బట్టి నీ జీవితానికి వెల కడతారు అంతే.
అది వారి స్థాయి.
కానీ నీ విలువ నాకు ఒక్కడికే తెలుసు.... నువ్వు నాకు వెలకట్టలేని అమూల్యమైన నిధివి.

Friday, April 29, 2016

అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........

అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........
ఓ కొడుకు.........కోడలు....వారి పుత్రుడు.......
..వారితో పాటు
నాన్నమ్మ
ఒకే ఇంట్లో ఉండేవారు.
ఆ కోడలికి అత్తగారిని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచం
ఉండేది.ఎన్నో సార్లు భర్తను అడిగి చూసింది. కానీ ఆ కొడుకు దానికి
ఒప్పుకోలేదు..........రోజూ ఏదో వంకతో భర్తను సాధించసాగింది.
ఒకరోజు భర్తతో మంచిగా ఉంటూనే..........ఇలా అన్నది......
" మీ అమ్మ ను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి.....సమయానికి
ఆమెకు
వేడి వేడిగా వేళకు చేసి
పంపుతాను. ఆమెకూడా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కసారి
ఆలోచించండి "
ఏదో చికాకులో ఉండి " సరేలే చూద్దాం " అన్నాడు భర్త......ఇదే
అదనుగా
అత్తగారికి ఇంటికి పక్కనే
ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు......
ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదు అనలేక.........తనవల్ల
ఇద్దరి
మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది..
కానీ కొడుకు కు
తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది .
అదేంటంటే.........అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి టిఫినుకు

పళ్ళెం తీసుకుని అత్తగారు
రావాలి....
పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది....
...అడుక్కుతినే
దానిలా
అలా వెళ్ళడం బాధగా
అనిపించినా కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ
అత్తగారు.
ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది..........నాన్నమ్మ
అలా దూరంగా
ఉండటం ఆ
పసిమనసుకు నచ్చలేదు. అలా తిండికోసం నాన్నమ్మ రావడం
అస్సలే
నచ్చలేదు....
వాళ్ళ అమ్మకు తెలియకుండా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి
ఆడుకునేవాడు.......
అలా కొన్ని సంవత్సరాలు గడిచి పోయాయి....మనవడికి మంచి
ఉద్యోగం
వచ్చింది....మొదటి జీతం
రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకుని వొచ్చాడు.......
.తల్లి
ఆనందంతో ..........
" నామీద ఎంత ప్రేమరా! నీకు నాకోసం వెండి పళ్ళెం తెచ్చావా! నువ్వే
రా నా
కొడుకంటే" అంటూ కొడుకును మెచ్చుకుని మళ్ళీ ఇలా అంది.......
" ఇంట్లో ఎవరికీ వెండి పళ్ళెం లేదు మరి నాకే ఎందుకు తెచ్చావురా
కన్నా! "
అని అడిగింది.
దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు....
" అమ్మా! రేపు నాకు పెళ్ళి అవుతుంది.. నువ్వుకూడా వేరేగా ఉండాల్సి
వస్తుంది కదా! అప్పుడు
నా పెళ్ళాం నీకు కనీసం స్టీలు పళ్ళెం కూడా ఇవ్వడానికి
ఒప్పుకోకపోవచ్చు
....అందుకే ఇప్పుడే
వెండి పళ్ళెం కొనేశాను..........రేపు నువ్వు ఏ ఆకులోనో అన్నం
తినడం నేను
చూడలేనమ్మా!"
కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు
ఉండాలి
కదమ్మా!"
కాబట్టీ............మనము ఇతరులకు చేసే మంచైనా, చెడైనా
మళ్ళీ
మనకే తిరిగి వస్తుంది....
తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తూ........మీ
పిల్లలకు
కూడా నేర్పకండి...
.

జీవిత ఉపయెాగాలు

జీవిత ఉపయెాగాలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.

2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.

4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.

5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.

6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).

7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.

8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.

9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.

10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.

11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.

12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.

13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.

14.రాత్రి పూట ఎంత తినాలి
జ.  చాలా తక్కువగా, అసలు తిననట్టు.

15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.

16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.

17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.

18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.

19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.

20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.

21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.

22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.

23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).

24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.

25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.

26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.

27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.

28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .

29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌

30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.

31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.

32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.

33. ఏ చికిత్సా విధానం  మంచిది
జ. ఆయుర్వేదం.

34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).

35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).

36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).

37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.

38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.

మిత్రులారా ఈ post నచ్చితే share చేయటం మర్చిపోకండి

ఈ-మెయిల్ పొరపాటు.!

ఈ-మెయిల్ పొరపాటు.!
.
ఒక వ్యక్తి కొత్తగా హోటల్ లోకి దిగాడు. రూమ్ లోకి రాగానే కంప్యూటర్ కనిపించింది.
భార్యకి ఈ-మెయిల్ పంపించాలనుకున్నాడు. కానీ తొందర్లో చూసుకోకుండా తప్పుడు ఈ-మెయిల్ అడ్రసుకి పంపించేశాడు.
కట్ చేస్తే ఎక్కడో మరో చోట భర్త కోల్పోయిన ఒక స్త్రీ స్మశానం నుంచి అప్పుడే తిరిగి వచ్చింది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తనకు సంతాప సందేశాలు వచ్చి ఉంటాయేమోనని ఈ-మెయిల్ ఖాతా తెరిచింది. వాటిలో ఒక మెయిల్ చూడగానే కళ్ళు తిరిగి పడిపోయింది.
ఆ శబ్దం వినగానే ఆమె కొడుకు కంప్యూటర్ దగ్గరికి వచ్చి చూశాడు.
ఆ ఈ-మెయిల్ సారాంశం. ప్రియమైన భార్యామణీ! విషయం: నేను చేరుకున్నాను. నేను ఇంత తొందరగా మెయిల్ చేస్తున్నందుకు నీకు ఆశ్చర్యంగా ఉండచ్చు. మన ప్రియమైన వాళ్ళకు ఈ-మెయిళ్ళు పంపుకునేందుకు వీలుగా ఇప్పుడిక్కడ కంప్యూటర్లు కూడా పెట్టారోయ్!
ఇప్పుడే చేరుకుని లోపలికి చెక్-ఇన్ అయ్యాను.
రేపు నువ్విక్కడికి చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తాను. నీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటాను. నీ ప్రయాణం కూడా నా ప్రయాణం లానే సుఖంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ…
నీ ముద్దుల రేడు
.

ఒక రోజు సర్దార్ ఉద్యోగం కోసం అని ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఇతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి కూర్చుంది.

అమ్మాయి : ‘‘మీరు మందు తాగుతారా..?’’
సర్దార్ : ‘‘అవును’’.

అమ్మాయి : ‘‘ఎంత?’’
సర్దార్ : ‘‘రోజుకి ఆరు పెగ్గులు తాగుతా’’!

అమ్మాయి : ‘‘ఓహో.. ఆ ఆరు పెగ్గులకు ఎంత ఖర్చవుతుంది?’’
సర్దార్ : ‘‘సుమారు 1000 రూపాయల వరకు’’.

అమ్మాయి : ‘‘ఎప్పటినుంచి తాగుతున్నావ్?’’
సర్దార్ : ‘‘దాదాపు 14 సంవత్సరాల నుంచి’’

అమ్మాయి : ‘‘ఓహో.. అంటే రోజుకు 1000 రూపాయల లెక్కను నెలకు 30000 రూపాయలు తాగడానికి ఖర్చు పెడుతున్నావన్నమాట! అలాగే సంవత్సరానికి 360000 రూపాయలు! అంటే మొత్తం 14 సంవత్సరాలలో నువ్వు 50 లక్షల రూపాయల వేస్ట్ చేశావ్. నీకో విషయం తెలుసా.. అదే 50 లక్షలు వుండుంటే ఇప్పటికి నువ్వు BMW కొనుండేవాడివి’’

సర్దార్ : ‘‘నువ్వేమైనా మందు తాగుతావా?’’

అమ్మాయి : ‘‘లేదు. నేను ఇంతవరకు దానిని ముట్టుకోలేదు కూడా!’’

సర్దార్ : ‘‘మరి నీ BMW ఏది?’’  హాహాహాహాహా... హాహాహాహాహ.. అని నవ్వుకున్నాడు.