Pages

Monday, December 26, 2016

* అగ్ని దేవుడు

* అగ్ని దేవుడు

జీవితంలో ఎదురయ్యే క్లేశాలనూ, వినాశాలనూ, తప్పిదాలనూ, నిర్మూలించి సర్వతోముఖ శ్రేయస్సును అందించే అగ్ని తత్త్వం అపూర్వం.

• పాపమే అంటని అగ్నిదేవుడు సకల వ్యాపియై తన జ్వాలల ద్వారా లోకాన్ని పునీతం చేసి సత్యరూపంగా చిత్రిస్తుంటాడు.

భారతీయ సంస్కృతికీ, సంప్రదాయానికీ ఆలవాలమైన ప్రాకృతిక సౌందర్యం మానవ మనుగడకు ఊతమందిస్తూ రక్షణ కవచమై అలరారుతుంది. మనిషి ప్రకృతిని ఆరాధిస్తే, ప్రకృతి కూడా మనిషిని ఆదరిస్తుంది. ఆలంబనై నిలుస్తుంది. పరస్పర సహకారంతో మనుగడ సాగించడం ప్రకృతి ప్రణాళిక. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశమనే అయిదు తత్త్వాలే సృష్టికి మూలహేతువులై పంచభూతాలుగా ప్రకృతిలో భాగమయ్యాయి. మనిషి ముఖ్య ఆధారాలై భాసిల్లుతుంది.

సర్వాగ్రణీ, సర్వ ప్రథముడూ అయిన అగ్నిదేవుడు ప్రకృతి శక్తులలో ప్రముఖుడూ, ప్రధానుడు. భూమండలంలోని ప్రముఖ తత్త్వాలకు ఆలంబన అగ్నితత్త్వం. సత్యనిష్ఠతో ప్రేరితమైన అగ్నిజ్వాల లోకంలోని సమస్తమునూ పవిత్రీకరిస్తుంది. పావనం చేస్తుంది. అందుకే స్వర్గ ప్రాక్తికి సాధనం అగ్ని ఆరాధన అంటోంది వేదం.

‘" ఓం అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్య దేవ మృత్విజమ్|
హోతారం రత్నధాతమమ్|| "

సృష్టి యజ్ఞానికి ప్రథమ పురోహితుడూ, లోకంలోని అందరి ఆహుతులనూ మోసుకెళ్లి దేవతలకర్పించే ఏకైక యాగపురుషుడూ అగ్నిదేవుడు

అగ్ని దేవునికి రెండు తలలు , ప్రతి తలకి రెండు కొమ్ములు ,ఏడు నాలుకలు, ఏడు చేతులు, మూడు కాళ్ళు ఉంటాయి. ఈయనకు కుడి వైపు భార్య స్వాదా దేవి, ఎడమవైపు స్వాహా దేవి ఉంటుంది. దైవ కార్యాలలో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాలలో స్వదా దేవి తన పాత్ర పోషిస్తుంది. ఈయన వాహనం మేక. అన్నిటినీ ఈయన ఆరగించ గలడు కావునా ఈయన్ని ” సర్వభక్షకుడు ” అంటారు. ఇంకా ఈయనకు హుతవాహనుడు, దేవముఖుడు, సప్తజిహ్వుడు, వైశ్వానరుడు, జాతవేదుడు అని కూడ పేర్లు.

సృష్టి యజ్ఞపు అంతరార్థాన్ని ఆవిష్కరించే వాడూ, నిత్యనిజసత్య స్వరూపుడూ, అనంత మహిమాన్వితుడూ అయిన అగ్నిదేవుడు దేవతలందరితో భువికి అరుదెంచి ప్రసన్నుడై ఆశీర్వదించేలా వారందరినీ హవిస్సులతో తృప్తిపరచి నిష్పక్షపాతంగా లోకాన్ని సుఖిక్షం చేసే దేవదేవుడు.

ఇవి చదివి తెలుసుకొందాం. .

ఇవి చదివి తెలుసుకొందాం. .
*
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) -
కుశార్, పాకిస్తాన్
*
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) -
లాహోర్, పాకిస్తాన్
*
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు
నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
*
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ
కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
భాగవతం,మహాభారతం
*
మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి
రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్
*
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం, ఆంధ్రప్రదేశ్
*
జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
*
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
*
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై
దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
*
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
*
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి
విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి
తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర
సముద్రతీర ప్రాంతం
*
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ
ఒరిస్సా
*
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్
జిల్లా,మధ్యప్రదేశ్
*
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
*
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు
బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
*
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన
చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
*
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
*
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-
కురుక్షేత్ర దగ్గర
*
హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
*
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
*
వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
*
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) -
గ్వాలియర్
*
మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్
ప్రావిన్స్, పాకిస్తాన్
*
ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
*
గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్,
హర్యానా
*
కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం – కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్)
*
పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
*
కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -
గిర్నార్,గుజరాత్
*
శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
*
హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా,
ఉత్తర్ ప్రదేశ్
*
విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) -
విదర్భ, మహరాష్ట్ర
*
కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
*
చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) – బుందేల్ ఖండ్,
మధ్యప్రదేశ్
*
కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) – దాతియ జిల్లా,
మధ్యప్రదేశ్
*
ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ,
ఢిల్లీ దగ్గర
*
కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
*
పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్
,ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
*
కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) -
కంపిల్, ఉత్తర్
*
జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి,
బీహార్
*
కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన
ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా
*
మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి
జైపూర్ వరకు వున్న ప్రాంతం,రాజస్థాన్
*
విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్
నగర్,రాజస్థాన్
*
శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
*
ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
*
నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం –
ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్
*
జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
*
కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)-ల నేపాల్ లోని తిలార్కోట్
*
బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
*
గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్......

జ్యోతిష్యం కర్మసిద్ధాంతం :

జ్యోతిష్యం కర్మసిద్ధాంతం :

ఈ రోజు మనమున్న స్థితికి గతజన్మలో మనం చేసిన కర్మఫలం కారణం. అలాగే ఇవాళ మనం చేసిన కర్మల ఫలితాన్ని రాబోయే జన్మలో మనం అనుభవించక తప్పదు. ఈ విషయాలను మన ఋషులు మనకు ఉపదేసించారు. పాపకృత్యాలే అన్నింటికీ కారణమన్నారు. భగవంతుడు కరుణామయుడు. అదే సమయంలో న్యాయమూర్తి కూడ! మనం చేసిన పుణ్యాలకు మోక్ష ఫలాన్ని అందిస్తూనే, పాపకృత్యాలకు తగిన శిక్షను అమలు చేస్తాడు. ఇది తప్పదు.

ఈ నేపథ్యంలో జ్యోతిశ్శాస్త్రం భవిష్యత్తులో మనకు జరుగబోయే విషయాలను తెలియజేసి, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మార్గదర్శకంగా ఉంటుంది. ఒక విపత్తు వస్తుందని ముందుగా తెలిస్తే, దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి, దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో మనకు తెలియకుండా ప్రమాదం జరిగితే, ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం కూడా భవిష్యత్తులో జరుగబోయే సంఘటనల గురించి ముందుగానే చెప్పి, మనం మానసికంగా ఎదుర్కోడానికి తగిన ఉపాయాలను సూచిస్తూ సహాయకారిగా ఉంటుంది. జ్యోతిష శాస్త్రం మనకు మార్గదర్శకమై బాధల నుంది విముక్తి పొందే మార్గాన్ని స ూచిస్తుంది. కర్మ సిద్థాంతం మూడు రకాలైన కర్మలను గురించి చెబుతోంది.

1. ప్రారబ్దకర్మ: గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితాన్ని ప్రస్తుతం అనుభవించడాన్ని ప్రారబ్ద కర్మ అంటారు.

2. సంచితకర్మ: గతజన్మలో మిగిలిపోయిన కర్మఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవించడం సంచితకర్మ.

3. ఆగామికర్మ: ప్రస్తుతజన్మలో మనం చేస్తున్న కర్మల ఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించేదిగా రూపుదిద్దుకోవడాన్ని ఆగామికర్మ అనంటారు.

మానవునికి తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఒక జన్మచాలదు. శ్రీకృష్ణ భగవానుడు మానవుడు చేసే ఏ కర్మ అయినా తనకు అంటకుండా, భగవంతునికి సమర్పణ భావంతో చేయాలని, దీనివల్ల మానవునికి తక్కువ జన్మలలో మోక్షప్రాప్తి సుగమమై, జనన మరణ చక్రాల నుంచి తప్పుకోవడం జరుగుతుంది. గత జన్మలో చేసిన పాప కర్మల ఫలితాల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి వేయడానికి జ్యోతిష శాస్త్రం, జపం, ధర్మం, హోమం వంటి మార్గాలను సూచించింది. ఈ జన్మలో మనం చేసే మంచి కర్మల ఫలితాలు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ప్రభావాన్ని తగ్గించి మనిషికి తక్కువ దు:ఖాన్ని కలుగజేస్తుంది. భగవంతుని ప్రగాఢంగా నమ్ముకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్ర జ్ఞానం అనాయాసంగా మనిషిని చేరుతుంది.

ఎవరైనా... పరిహార ప్రక్రియలు పాటిస్తే... జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తి పొందగలరు. అందుచేత జయం, దానం, హోమం, శాంతి, దేవాలయ దర్శన, రత్నధా రణ, మొ విషయాలు జ్యోతిష్యంలో చెప్ప బడ్డాయి. ఇవి చేయటానికి ముందు మరికొ న్ని విషయాలు తెలుసుకొని అప్పుడు పాటిస్తే మరింత ఫలితం ఉంటుంది.

‘భా’ అంటే కాంతి, కాంతి విజ్ఞానానికి, ఆనం దానికి, పరమాత్మకు సంకేతం. దాని యందు ‘రతి’ (వీలు) గలవారే భారతీయులు.

కర్మ సిద్ధాంతం అంటే (ఈ జన్మలో కాని, పూర్వజన్మలో కాని తాను చేసిన పనికి ఫలితం తానే అనుభవించాలి అని కొందరి భావన. కాని చేసిన కర్మకు ప్రతిఫలం అనుభవించుట సార్వత్రికంగా నియ మం కాదు. అప్పుచేసిన వాడు తీర్చకపోతే జైలుకు పోవుట కర్మ ఫలితంగా భావిస్తే... ‘తీర్చుట’ అనే ప్రక్రియ జైలుకు పోకుండా కాపాడుతుంది. అనగా పూర్వం చేసిన కర్మకు అనుభవించుటం ఒక మార్గమైతే...

దానిని నిరోధించుట కొరకు మరో కర్మ చేయుట మ రో మార్గం. కాగా జాతకం లో ఉన్నది తప్పక అనుభవించాలి. అనే విధానం మాత్రం సరియైనది కాదు. బృహజ్జాతక వ్యాఖ్యాత భట్టత్పలుడు ‘జాతక ఫలితాన్ని అనుభవించుటే తప్పనిసరి అయితే దానిని తెలుసుకొనుట వ్యర్థం. భావి ఫలితాన్ని ముందుగా తెలుసుకొట వల్ల రాబోయే దుఃఖం కోసం ఇప్పటినుండి దుః ఖించడం అనే నష్టాలుండటం వల్ల జాతక ఫలితం తెలుసుకోవడమే నష్టప్రదం అవుతుం ది. శాస్త్ర ప్రయోజనం అదికాదు. ఒక జాతకంలో శుభ ఫలితాన్ని తెలుసుకొని అనువైన కృషి చేయటం ద్వారా ఫలితాన్ని సంపూర్ణంగా సాధించవచ్చు.

జాతకంలోని దుష్ట ఫలితాన్ని విశ్లేషించి దానాదికములైన పుణ్యకర్మల ద్వారా శుభఫలితాన్ని పెంచుకోవచ్చు. దుష్టఫలితాన్ని ముందుగా తెలుసికొనుట ద్వారా దానికి వ్యతిరేదిశలో ప్రయత్నించి దుష్ట ఫలితాన్ని జయించవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఆ దోష ప్రాబల్య శా తాన్ని గమనించి దాన్ని జయించడం సాధ్యం కాని పంలో దానికి సిద్ధపడి తన జీవనగమనంలో అనుగుణమైన మార్పులను చేసుకోవచ్చు’ అని వివరించాడు.

కర్మ ఫలితం వుంటుంది. అది దుష్టమైనదైనపుడు దాని నివారణకు చేసే కర్మకూ ఫలితం ఉంటుంది. కర్మను కర్మచేతనే జయించాలి. పూర్వం చే సిన కర్మను దానివల్ల వచ్చే ఫలితా న్ని అదృష్టమని, దైవికమని పిలుస్తుంటారు. ‘విహన్యాద్ధుర్బలం దైవం పురుషేణ విపశ్చితా’ అనే వ్యాసుని వచనం పూర్వకర్మను ప్రస్తుత కర్మచే జయించవ్చనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నది. మనమిదివరలో చేసిన కర్మననుసరించి మ న జననం సంభవిస్తుంది. మన జననం మనచేతిలో లేదు, కాని అప్పటి గ్రహస్థితి పూర్వకర్మకు అనుగుణంగా ఉంటుంది. ఆ గ్రహస్థితి ప్రభావం కాలక్రమంలో దశాక్రమాన్ననుసరించి ఆయా భావనలు ప్రేరేపిస్తుంది.

ప్రేరేపించబడిన భావనకు స్పందించిన వ్యక్తి తన భావాలను అనుసరించి ప్రవర్తించ కుండా శాస్త్రం, సామాజిక న్యాయం, అనుభవం ఆధారంగా చేసుకొని వివేకంతో ప్రవర్తించి మంచి న పెంచుకోవడం, చెడ్డను తొలగించుకోవడం, చేయవలసి వుంటుంది. దోషఫలితం సిద్ధించే సమయాన్ని జాతకం తెలుపుతుంది. దానిని ముందుగా గుర్తించడం ద్వారా దానిని జయిం చే అవకాశాన్ని జాతకం కల్పిస్తుంది. అఘజాతకంలో ‘యదుపచిత మన్య జన్మని శుభ శుభం తస్య కర్మణః పంక్తిం వ్యం జయతి శాస్తక్రులత్‌ తమసి దైవ్య ణి దీపమేవ’ అన్నారు వరాహమిహిరుడు. పూర్వజన్మలో చేసిన శుభాశుభ కర్మల యొక్క ఫలానుభవ కాలాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. చీకటిలోని వస్తువులను దీపం సహాయం తో గుర్తించినట్లుగా కలుగబోయే శుభాశుభాలను జాతకం ద్వారా గుర్తించి అనుకూల, వ్యతిరేక ప్రక్రియ ల ద్వారా జీవితాన్ని సుఖవం తం చేసుకొనుటకు ఈ శాస్త్రం సహకరిస్తుంది.
కర్మ 3 విధులు. ప్రారబ్ధం, సంచితం, ఆగామి. ప్రారంబ్ధం అంటే -

పూర్వజన్మలో మనం చేసిన కర్మల ఫలితం అనుభవించడం ప్రారంభించింది. ప్ర - ఆర బ్దం - ఇంతకు ముందే ఆరంభింపబడింది. దానిని జయించ శక్యం కాదు. విడిచిపెట్టిన బాణం యొక్క మార్గాన్ని మళ్ళించ డం అంత సులభం కాదు. సంచితం- సంచితకర్మ అంటే పూర్వం చేయబడిన నిల్వవున్నది. ఆగామి - అంటే రాబోయే కాలంలో పరిపక్వమయ్యేది. మన సత్ప్రవర్తన ద్వారా ఆ గామిని మంచిగా మలచుకోవచ్చు. జాతకం ద్వారా రాబోయే దుష్టఫలితానికి వ్యతిరేకంగా మనం చెయ్యాల్సి న కృషిని అం చనా వేసుకొని ఆధ్యాత్మిక లౌకిక ప్రయత్నాల ద్వారా కృషి చేసి దుష్టఫలితాన్ని అధిగమించవచ్చు. ఉదాహరణకి... నిన్న ఒక వ్యక్తిని మనం కొట్టాం. ఈ రోజు అతను మనల్ని కొట్టడానికి పదిమందిని వెంటవేసుకొనివస్తున్నాడు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని మనం అతని చేతిలో దెబ్బలు తినటం తప్పనిసరి అని తెలిస్తే మూడు విధాలుగా దానిని అధిగమించవచ్చు.

ఎ) అతను ఎన్నింటికి వస్తున్నాడో తెలుసుకొని అతను వచ్చే సమయానికి ముందే అతనితో వచ్చే బలగం కాన్నా ఎక్కువ బలగంతో వెళ్ళి ‘క్షమార్పణ’ చెప్పడం ఒక మార్గం. జాతకంలో ఉన్న దుష్టఫలితం యొక్క శాతాన్ని గమనించి దానాదుల ద్వారా దానికన్నా ఎక్కువ పుణ్యాన్ని సంపాదించి గతంలో తాను చేసిన అపరాధాలను క్షమించమని ప్రార్థించేటువంటి ఇది.

బి) ఎదుటివాడు 10 మందితో వస్తే అతన్ని జయించే విధంగా ఇంకా ఎక్కువ బలగంతో వెళ్ళి ఎదురించడం రెండో మార్గం... జాతకంలో దుష్ట సమయాన్ని గుర్తించి లౌకికమైన కృషిని పెంచి దుష్టఫలితాన్ని అధిగమించే ప్రయత్నం చేయడం ఇలాంటిదే.

సి) అతను వచ్చేసమయానికి అతనికి కనిపించకుండా దాక్కోవడం. మనకు జాతకంలో వచ్చే దుష్టసమయాన్ని గుర్తించి నూతన ప్ర యత్నాలు చేయాలి.

పెళ్ళినాటి ప్రమాణాల పరమార్ధం:

పెళ్ళినాటి ప్రమాణాల పరమార్ధం:

వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే పెళ్ళి ఆరంభమవుతుంది. ఒక శిశువుకు తన కుటుంబము నుండి, పరిసరాల నుండి తన అంతఃచేతన ద్వారా అందిన నైతిక సూత్రాలనే బీజాలు వివాహం తరువాతనే మొలకెత్తి వేగంగా పెరగనారంభిస్తాయి. ప్రేమ, తన్మయత, త్యాగం, భక్తి, ఓరిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం. ఈ భావాన్ని పెండ్లి కుమారునికి కలిగించడానికే వేదాలు ఇలా ప్రకటించమని అతనికి సలహా ఇస్తుంది.

ప్రియా! ఆవాహనం చేయబడిన దేవతల సన్నిధిలో, మన జీవితంలోని పవిత్ర సందర్భంలో, నీ పాణిగ్రహణం చేస్తున్నాను. ఆశీర్వదించబడిన ఓ స్త్ర్రీ రత్నమా! దీర్ఘకాలం నా జీవిత భాగస్వామిగా ఉండు. నా కుటుంబ బాధ్యతలను నీ కప్పగిస్తున్నాను. సంతోషముగా నీ బాధ్యతను నెరవేర్చు. పవిత్రమైన ఈ ప్రమాణం దైవసన్నిధిలో పెండ్లి కుమారుడు చేసే ఆ క్షణం నిజానికి ఎంతో ఆనందకరమైనది. ఆ రోజే ఇంటి బాధ్యతల విభజన జరుగుతుంది. జీవనోపాధి సంపాదనకు భర్త బాధ్యత వహిస్తే, గృహనిర్వహణను భార్య నిర్వహిస్తుంది. ఇద్దరూ శ్రధగా తెలివిగా తమ భాధ్యతలను నిర్వహించినప్పుడే వివాహ జీవితం సఫలమౌతుంది. పవిత్రమైన హిందూ వివాహంతో జీవితంలో పరీక్ష మొదలౌతుంది. కనుక చేసిన ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నప్పుడే వైవాహిక జీవితం అర్ధమవుతుంది. త్యాగం, నిష్టల నిర్వహణయే నిజమైన జీవితానికి మార్గదర్శకమౌతుంది. వివామాహోత్సవంలో చేసిన ప్రమాణాన్ని పూర్తిగా పాటించినట్లయితే, వైవాహిక జీవితంలో స్వర్గ సుఖాన్నిచ్చే వాతావరణాన్ని వ్యక్తి సృష్టించుకోగలుగుతాడు. నిజానికి భార్య భాగ్యాధి దేవతయైన లక్ష్మి అవతారమే. ఈ సంపద లేకపోతే మానవజీవితం సారవిహీనం, అనాకర్షణీయం అవుతుంది. పెండ్లికుమారుని ఈ ప్రకటనలో ఎంతో నిజం ఉంది. నీవు లక్ష్మివి. నీవులేని నేను ధనహీనుడను. నీవులేకపోతే నా జీవితంలో ఆనందమేలేదు. ఓ అందాలరాశీ! మన కలయిక సామవేదం, దానిలోని మంత్రం; అది భూమి, ఆకాశాల కలయిక వంటిది. పై వైదిక మంత్రంలో ఋషి వివాహానికి ఒక మంచి వివరణ ఇచ్చారు. వివాహ వ్యవస్థ ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదు. పూర్తి సంఘానికి సంబంధించినది. వివాహాలు ప్రమాణాలకు కట్టుబడే, పవిత్రత ముద్రను పొందలేవు. అందువల్ల ప్రతి జంటా తమ సాంఘికబాధ్యతలను గుర్తెరగాలి.

తరతరాల శక్తినీ, సార్వభౌమాధికారాన్నీ, గౌరవాన్నీ యధాతధంగా నిలుపుతామనే ప్రమాణమే వివాహం. పురాణాలలో చెప్పబడిన శ్లోక సారంశం ఇది -

వివాహ ముఖ్యోద్దేశం - పస్పర ప్రేమమయ జీవితం గడుపుతూ, దేశానికి నీతివంతులైన, శ్రేష్ట సంతానాన్ని అందించడం. పిల్లలకు జన్మనిచ్చి వంశవృక్షాన్ని నిలపడమే వివాహానికి ముఖ్య ఉద్దేశం. ప్రేమలోని ఘాడతను గుర్తిస్తూ కుటుంబాన్ని ఆనందంతో, ఐక్యంగా ఉంచడం కోసమే వివాహం. ఇతరుల మంచికోసం ఆత్మసమర్పణా భావాన్ని కలిగి ఉండి, నిజమైన జీవిత గమ్యాన్ని చివరికి గుర్తించగలగడమే. యదార్ధానికి వివాహం యొక్క పవిత్రోద్దేశం. స్త్రీ పురుష వివక్షత అనే అసాంఘిక ద్రుష్టిని విడనాడాలి. పరిపూర్ణ మైన ఆనందమయ జీవితాన్ని పొందడానికి ఆధారాన్ని వివరించిన మంత్రసారం ఇది  పరిపూర్ణమైన ప్రేమ, అభిమానాలతో కూడిన ఉత్తమమైన జీవితాన్ని మనం గడప గలగాలి. మన భావాలు పవిత్రంగా ఉండాలి. శత సంవత్సరాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని చూస్తూ, వసంతఋతు సంగీతాన్ని వింటూ, జీవించగలగాలి. భార్యాభర్తల ఐక్యత, ప్రేమ, సాన్నిహిత్యాలే వారి ఆనందమయ వివాహ జీవితానికి ఆధారాలు. కనుక వివాహాన్ని శారీరక ఆనందాన్ని ఇచ్చేదిగా కాక, జీవితాంతం వుండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. జీవిత భాగస్వాములైన ఇద్దరు వ్యక్తులకు ఆత్మ భాగస్వాములుగా ఎదిగే అవకాశం కల్పించేదే వైవాహిక జీవితం.

వధూవరుల మంగళవచనములు:
వరుడు: త్రిమూర్తుల దివ్యస్వరూపం. విధాత చూపిన విజయోన్ముఖపథంలో విజ్ఞతతో నడవటానికి ఉద్యుక్తుడైన సిద్ధ పురుషుడు

వధువు: లక్ష్మీ, సరస్వతి, పార్వతిల ఏకాత్మతా రూపం పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం.

బాసికము: మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిలో సుఘమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమ వైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి దోషం పడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసికధారణ చేస్తారు.
అడ్డుతెర: దీనికి మరోపేరు తెరశెల్ల తెల్లని వస్త్రంపై శ్రీ (స్వస్తిక్) అని వ్రాయబడి ఉంటుంది. వధూవరులను తూర్పు, పడమరలకు అభిముఖముగా కూర్చోబెట్టి, మంగళ వాయిధ్యాల మధ్య, ముత్తయిదువులు మంగళగీతాలు మరొకవైపు ఆలపిస్తుండగా, వధూవరులచే మహా సంకల్పం చెప్పిస్తారు.

కన్యాదానం: కన్యాదాన సమయంలో విష్ణు స్వరూపుడైన నీకు (వరునకు) బంగారు ఆభరణముల చేత అలంకరించబడిన నా కూతురు (వధువు)ను సమర్పించుకుంటున్నాను అనే భావంతో ఈ శ్లోకం చేబుతాడు కన్యాదాత. కన్యాంకనక సంపన్నాం కనకా భరణైర్యుతామ్

దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా:
జీలకర్ర - బెల్లం: ఈ జీలకర్ర బెల్లం అనేది ఒక పాసిటిమ్ ఎలక్ట్రిక్ చార్టర్. వధూవరుల పరస్పర ఆకర్షణకు లోనుకావడానికి వేద ఋషులు దీనిని నిర్ణయించారు. సహజీవనానికి నాందిగా నిలపడానికి మేధస్సును చైతన్యపరిచే ఈ జీలకర్ర బెల్లం తలపై పెట్టుకుంటారు.

మాంగల్యధారణ:
మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా,
కంఠేబద్నామి శుభగేత్వం జీవం శరదశ్శతమ్
నా జీవితానికి మూలమైన, హేతువైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించాలి అంటూ వరుడు మాంగల్య ధారణ చేస్తాడు.
నాతిచరామి: 'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా వుంటామని ఇద్దరు కలసి చేసే ప్రతిజ్ఞ "నాతిచరామి..అక్షింతలు: అక్షింతల తోటే పెళ్ళికి సంపూర్ణత్వం చేకూరుతుంది. క్షతము గానివి, అక్షింతలు, అనగా ఎప్పటికి నిలిచేవని, అమరమైనవి అనేది వేదార్ధము, తెల్లని బియ్యానికి పసుపు కలిపి అక్షింతలు తయారుచేస్తారు. బియ్యం చంద్రుడికి సంకేతం. చంద్రుడు మన కారకుడు, వధూవరుల మనోభీష్ఠిని సుస్ధిరపరచే శక్తిని సిద్ధింపచేయడానికి చంద్రగుణానికి సంకేతంగా బియ్యాన్ని అక్షింతలుగా వాడడం మన ప్రాచీన సంప్రదాయం.

తలంబ్రాలు: పెళ్ళి పండుగలో ఇది ఎంతో వేడుక కలిగించే కార్యక్రమం. ఇందులో మొదటగా వరుడు "సమాజశ్రేయస్సు కుటుంబవృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని" దోసిలి ఎత్తి తలంబ్రాలు పోస్తాడు. అందుకు వధువు తలవంచి అంగీకరిస్తూ" వధువు "ఆ సంతానజీవన గమనానికి అవసరమైన పాడిపంటలను సమృద్ధిగా అందించమంటూ" తనవంతుగా తలంబ్రాలు పోస్తుంది. దానికి సమాధానంగా వరుడు "నేను అందించే ఆర్ధిక సంపదను అణకువగా, సమయోచితంగా వినియోగించమని" తిరిగి తలంబ్రాలు పోస్తాడు. ఆ తరువాత ఇరువురూ "త్యాగంతో, ధనంతో సహజీవనము సాగిద్దాము, బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందామని" ఒకరిపై ఒకరు వరుసగా తలంబ్రాలు పోసుకుంటారు. ఇవి వధూవరులకు ప్రమాణాలు, చూసేవారికి వేడుకలు.

సప్తపది - ఏడడుగలు: వధూవరులు నిలబడి ఒక్కో అడుగు వేస్తూ దైవశక్తి మంత్రములు పఠిస్తారు. ప్రణాళికా బద్ధంగా ప్రగతి శీలమైన జీవనము కొరకు అగ్నిసాక్షిగా సంకల్పం తీసుకుంటూ దైవా నుగ్రహం జీవితమంతా లభిస్తుందని భావిస్తూ ఏడడుగులు వేస్తారు.
మొదటి అడుగు - అన్నవృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధనవృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐధవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవనానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధిక.అరుంధతీ దర్శనము:ఈ భూగోళము ధ్రువము ఈ ఉత్పత్తి స్ధానము ధ్రువము. నీవు ధ్రువముగా ఉందువుగాక! నక్షత్రముల సమూహమున అరుంధతీవలె ధ్రువత్వమును పొంది వర్ధిల్లుము.